అందుకే ‘సైరా’లో చరణ్ను వద్దన్న చిరు!
ఓ చరిత్ర గురించి చెప్పాలంటే క్రీస్తుకు ముందు.. క్రీస్తు తర్వాత. అదే ఓ సినిమా గురించి అడిగితే? ఇంటర్వెల్కు ముందు ఇంటర్వెల్ తర్వాత
ఓ చరిత్ర గురించి చెప్పాలంటే క్రీస్తుకు ముందు.. క్రీస్తు తర్వాత. అదే ఓ సినిమా గురించి అడిగితే? ఇంటర్వెల్కు ముందు ఇంటర్వెల్ తర్వాత అనాల్సిందే. అందుకే ఇంటర్వెల్ సన్నివేశాల్ని పకడ్బందీగా ప్లాన్ చేస్తుంటారు దర్శక, నిర్మాతలు. ఇది అన్ని చిత్రాలకూ వర్తించినా.. స్టార్ కథానాయకుల సినిమాలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రం విషయంలో అలాంటిదే జరిగింది.
ఇందులో ఇంటర్వెల్ బ్యాక్డ్రాప్ కోసం షేర్ఖాన్ అనే శక్తిమంతమైన పాత్రను సృష్టించిందట చిత్ర బృందం. ఈ పాత్రకు సినిమాలో ఐదు నిమిషాల నిడివే ఉన్నప్పటికీ.. విరామానికి ముందు వచ్చే ఆ పాత్ర చిత్రానికి అత్యంత కీలకమైనదట. ఆ పాత్ర ఇంటర్వెల్ ముందే ‘‘నరసింహారెడ్డి, నీ లాంటివాడు దేశానికి కావాలి’ అంటూ చిరు చేతిలోని కత్తి తీసుకుని పొడుచుకుని చనిపోతుంది. ఈ చిత్ర స్క్రిప్ట్ పూర్తయ్యాక ఈ కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ఖాన్, సంజయ్ దత్లలో ఎవరినో ఒకర్ని ఎంపిక చేసుకుందామనుకుంది చిత్ర బృందం. కానీ, పలు కారణాల వల్ల వాళ్లు ఈ ప్రాజెక్టును వదులుకున్నారు.
దీంతో ఓ దశలో ఆ పాత్రను రామ్ చరణ్తో చేయిస్తే బావుంటుందనే అభిప్రాయానికొచ్చారట దర్శకుడు సురేందర్ రెడ్డి. కానీ, తండ్రి కారణంగా తనయుడు చనిపోయే సన్నివేశాన్ని ప్రేక్షకులు అంగీకరిస్తారో లేదో అనే సందేహంతో చరణ్తో ఆ పాత్రను చేయించడానికి ఒప్పుకోలేదట చిరు. అయితే ఇలాంటి చారిత్రక నేపథ్యంతో తెరకెక్కే చిత్రాలకు నిడివి ఎక్కువ ఉంటుందనే విషయం తెలిసిందే. తొలి దశలోనే నిడివి సమస్యను అదుపులో పెట్టగలిగితే నిర్మాతలకు బడ్జెట్ కలిసి వస్తుంటుంది. అందుకే ఈ సినిమాను సెట్స్పైకి తీసుకెళ్లడానికి ముందే.. స్క్రిప్ట్ దశలోనే కత్తెరకు పని చెప్పారట. ఈ క్రమంలోనే ఆ షేర్ఖాన్ పాత్రను స్క్రిప్ట్ దశలోనే తొలగించిందట చిత్ర బృందం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
Gurucharan Singh: బాలీవుడ్లో ప్రముఖ టీవీ నటుడు ఐదు రోజులుగా కన్పించకుండా పోవడం చర్చనీయాంశమైంది. అతడిని కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు