జానపద గాయకుడికి పవన్‌ సత్కారం

రాయలసీమకు చెందిన జానపద రచయిత, గాయకుడు పెంచల్ దాస్‌ను పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ సత్కరించారు. ‘శ్రీకారం’ సినిమాలోని ‘వస్తానంటివో.. పోతానంటివో..’ జానపద గేయాన్ని పెంచల్‌ దాస్‌ ఆలపించారు. ఆ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.

Published : 09 Mar 2021 20:32 IST

హైదరాబాద్‌: రాయలసీమకు చెందిన జానపద రచయిత, గాయకుడు పెంచల్ దాస్‌ను పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ సత్కరించారు. ‘శ్రీకారం’ సినిమాలోని ‘వస్తానంటివో.. పోతానంటివో..’ జానపద గేయాన్ని పెంచల్‌ దాస్‌ ఆలపించారు. ఆ పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. పెంచల్‌దాస్‌ హైదరాబాద్‌లో మంగళవారం పవన్‌కల్యాణ్‌ను కలిశారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. రాయలసీమ ప్రాంత జానపదాలను, అక్కడి మాండలికాన్ని నేటి తరానికి చేరువ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. కొద్దిసేపు జానపదాలు, మాండలికాలు అనే విషయం చర్చించారు. ఈ చర్చలో ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ కూడా పాల్గొన్నారు. అనంతరం పెంచల్‌దాస్‌ను పవన్‌కల్యాణ్‌ సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని