‘పెదరాయుడు’కు పాతికేళ్లు: అరుదైన వీడియో

అగ్ర నటుడు మోహన్‌బాబు కథానాయకుడిగా రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన విజయవంతమైన చిత్రం ‘పెదరాయుడు’. 1995 జూన్‌ 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌

Published : 15 Jun 2020 20:20 IST

హైదరాబాద్‌: అగ్ర నటుడు మోహన్‌బాబు కథానాయకుడిగా రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన విజయవంతమైన చిత్రం ‘పెదరాయుడు’. 1995 జూన్‌ 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. సోమవారంతో ఈ చిత్రం విడుదలై 25ఏళ్లు పూర్తి చేసుకుంది. మోహన్‌బాబు ద్విపాత్రాభినయం, అతిథి పాత్రలో రజనీకాంత్‌ నటన, స్టైల్‌ సినిమాను విజయపథంలో నడిపాయి. కాగా, ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. 

‘పెదరాయుడు’ చిత్ర ప్రారంభోత్సవం, ముహూర్త సన్నివేశానికి అలనాటి నటుడు ఎన్టీఆర్‌, దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు, దివంగత నిర్మాత డి.రామానాయుడు తదితరులు వచ్చి మోహన్‌బాబును ఆశీర్వదించారు. ఇక స్టైల్‌గా రజనీకాంత్‌ కండువా తిప్పుతూ కనిపించారు. ముహూర్త సన్నివేశాన్ని మోహన్‌బాబు-రజనీలపై తెరకెక్కించగా, ఎన్టీఆర్‌ క్లాప్‌ కొట్టారు. అలనాటి అరుదైన వీడియోను మీరూ చూసేయండి.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని