విద్యుత్ బిల్లు కట్టేందుకు కిడ్నీలు అమ్ముకుంటా

భారీగా విద్యుత్తు బిల్లు రావడంపై బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సి ట్విటర్‌ వేదికగా స్పందించాడు. తన ఇంటికి 1,03,564 విద్యుత్తు బిల్లు వచ్చిందని..

Published : 07 Jul 2020 03:57 IST

అధిక బిల్లు రావడంపై సరదాగా వ్యాఖ్యానించిన బాలీవుడ్‌ నటుడు

ముంబయి: భారీగా విద్యుత్తు బిల్లు రావడంపై బాలీవుడ్‌ నటుడు అర్షద్‌ వార్సి ట్విటర్‌ వేదికగా స్పందించాడు. తన ఇంటికి 1,03,564 విద్యుత్తు బిల్లు వచ్చిందని.. జులై 4న ఆ డబ్బులు తన ఖాతాలోనుంచి డెబిట్‌ అయినట్లు తెలిపాడు. ‘ప్రజలారా.. దయచేసి నేను రూపొందించిన పెయింటింగులను కొనండి. ఆ డబ్బుతో విద్యుత్తు బిల్లు చెల్లించాలి. తర్వాతి రాబోయే బిల్లు కోసం నా రెండు కిడ్నీలను అమ్మేందుకు సిద్ధమవుతున్నా’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. అనంతరం మరో ట్వీట్‌లో సమస్య పరిష్కారమైందని, విద్యుత్తు సంస్థ వెంటనే స్పందించినట్లు వెల్లడించాడు. ‘ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించిన అదానీ విద్యుత్తు సంస్థకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు.

బాలీవుడ్ నటీనటులకు అధిక విద్యుత్యు బిల్లు రావడం ఇదే మొదటిసారి కాదు. తాప్సీ, రేణుక శహానే, హ్యూమా ఖురేషి, నిమ్రత్‌ కౌర్‌, సోహా అలీఖాన్‌, అమ్ర్యా దస్తుర్‌, డినో మోరియా, కామ్య పంజాబ్‌తోపాటు పలువురు నటీనటులు జూన్‌కు సంబంధించి అధిక బిల్లు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలీవుడ్‌ నటులతోపాటు ముంబయి నగర వాసులు సైతం ఊహించని కరెంటు బిల్లుపై ఫిర్యాదులు చేశారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని