Tollywood: నిర్మాణంలో... వారసత్వం
హీరో కొడుకు హీరో అవ్వొచ్చు. దర్శకుడి అబ్బాయి మెగాఫోన్ పట్టుకోవచ్చు. నిర్మాతల సంతానం నిర్మాతలవడం అరుదే. అందులోనూ అమ్మాయిలైతే చాలా కష్టం. ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ మారుతున్నట్లు కనిపిస్తోంది. కొందరు నిర్మాతలు, దర్శకులు, స్టార్ హీరోల వారసురాళ్లు కోట్ల రూపాయల
హీరో కొడుకు హీరో అవ్వొచ్చు. దర్శకుడి అబ్బాయి మెగాఫోన్ పట్టుకోవచ్చు. నిర్మాతల సంతానం నిర్మాతలవడం అరుదే. అందులోనూ అమ్మాయిలైతే చాలా కష్టం. ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ మారుతున్నట్లు కనిపిస్తోంది. కొందరు నిర్మాతలు, దర్శకులు, స్టార్ హీరోల వారసురాళ్లు కోట్ల రూపాయల వ్యవహారాల్నీ చాకచక్యంగా చక్కబెట్టేస్తామంటూ దూసుకొస్తున్నారు. చిత్ర నిర్మాణంలో తమ సత్తా చాటాలని ఆసక్తి చూపుతున్నారు. కొత్త ప్రయాణం సాగిస్తున్నారు.
చిరు పుత్రిక- సుష్మిత కొణిదెల
తెలుగు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) తనయే సుష్మిత కొణిదెల (Sushmita Konidela). చదువు పూర్తయ్యాక ‘నిఫ్ట్’లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారు. రంగస్థలం, ఖైదీ నెంబర్ 150, సైరా సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేశారు. ‘షూటవుట్ ఎట్ ఆలేర్’ పేరుతో ఓ వెబ్సిరీస్ నిర్మించి ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగారు. సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ నాయకానాయికలుగా భర్త విష్ణుప్రసాద్తో కలిసి ‘గోల్డ్బాక్స్ ఎంటర్టైన్మెంట్స్’ (Gold Box Entertainment) పతాకంపై ‘శ్రీదేవి శోభన్బాబు’ పేరుతో ఓ కామెడీ ఎంటర్టైనర్ పట్టాలకెక్కిస్తున్నారు. కమ్రాన్ సంగీత దర్శకుడు. నాగబాబు, రోహిణి కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్లో టీజర్ విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్కుమార్ దిమ్మల. దీని విడుదల తేదీని ప్రకటించాల్సి ఉంది.
కోడి రామకృష్ణ తనయ - దివ్యదీప్తి
జగమెరిగిన శత చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ (Kodi Ramakrishna). ఆయన కూతురే దివ్యదీప్తి (Divya Deepti). మొదట్లో ఆయన దగ్గరే కొన్ని సినిమాలకు సహాయ దర్శకురాలిగా పని చేశారు. నాన్న అండతో మెగా ఫోన్ పట్టుకోవాలనీ భావించారు. ఇంతలో ఆయన హఠాన్మరణంతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. తర్వాత అమ్మ సలహాతో నిర్మాతగా మారారు. తొలి ప్రయత్నంగా కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్ జంటగా ‘కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్’ (Kodi Divya Entertainments) బ్యానర్లో ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ నిర్మిస్తున్నారు. శ్రీధర్ గాదె తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తైంది. మణిశర్మ సంగీత దర్శకుడు. ఇటీవలే విడుదల చేసిన టీజర్కి మంచి స్పందన లభిస్తోంది. ఆగస్టు 12 ఈ సినిమా విడుదల కానుంది.
గుణశేఖర్ వారసురాలు - నీలిమా గుణ
‘చూడాలని ఉంది’, ‘ఒక్కడు’ లాంటి బ్లాక్బస్టర్ చిత్రాలు అందించిన దర్శకుడు గుణశేఖర్. ఆయన పెద్దమ్మాయి నీలిమ (Neelima). బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్మినిస్టర్లో మాస్టర్స్ పూర్తి చేశారు. లండన్ కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్లో.. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి కొన్నాళ్లు డిజైనర్గానూ పని చేశారు. తర్వాత ఇండియా తిరిగొచ్చి నాన్నకి సాయంగా ఉంటున్నారు. ‘రుద్రమదేవి’ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ అనుభవంతో పూర్తిస్థాయి నిర్మాతగా మారారు. అగ్ర కథానాయిక సమంత ముఖ్యపాత్రలో ‘శాకుంతలం’ (Shaakuntalam) నిర్మిస్తున్నారు. ఈ పీరియాడికల్ డ్రామా చిత్రం రెండేళ్ల కిందటే మొదలైంది. ఇందులో సమంత శకుంతలగా నటిస్తోంది. రెండు నెలల కిందటే షూటింగ్ పూర్తై, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. డిసెంబరులో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. దీనికి దర్శకుడు గుణశేఖరే. దేవ్మోహన్, మోహన్బాబు, ప్రకాష్రాజ్, కబీర్ బేడీ, గౌతమిలాంటి భారీ తారాగణంతో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోందీ సినిమా.
ఏడిద శ్రీరామ్ కూతురు - శ్రీజ
సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగరసంగమం, స్వయంకృషి లాంటి ఉత్తమాభిరుచి గల సినిమాలు నిర్మించిన సంస్థ పూర్ణోదయ మూవీ క్రియేషన్స్. దీని సృష్టికర్త ఏడిద నాగేశ్వరరావు. ఆయన మనవరాలు, ఏడిద శ్రీరామ్ కూతురే శ్రీజ(Sreeja). తాత తండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ‘ఫస్ట్ డే.. ఫస్ట్ షో’కి నిర్మాతగా మారారు. దీనికోసం శ్రీజ ఎంటర్టైన్మెంట్స్ అనే సొంత సంస్థ ప్రారంభించారు. రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్ కథ అందించారు. షూటింగ్ పూర్తైంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. వంశీధర్గౌడ్, లక్ష్మీ నారాయణ పుట్టంచెట్టి తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్, సంచిత బసు హీరోహీరోయిన్లు. రథన్ స్వరాలందించారు. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
* నిర్మాత సుధాకర్రెడ్డి కూతురు, నితిన్ సోదరి నిఖితారెడ్డి శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై గతంలోనే చిత్రాలు నిర్మించారు. ఆమె నుంచి వస్తున్న తాజా యాక్షన్ రొమాంటిక్ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. నితిన్, కృతి శెట్టి, కేథరిన్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎస్.రాజశేఖర్రెడ్డి దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తై నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. ఆగస్టు 12న విడుదలవుతోంది.
* ‘ముద్దపప్పు ఆవకాయ్’, ‘నాన్నకూచి’, ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్సిరీస్, ఓటీటీ సినిమాలు నిర్మించి తన అదృష్టం పరీక్షించుకుంది నాగబాబు అమ్మాయి నిహారిక కొణిదెల (Niharika). త్వరలోనే తను ఓ ఫీచర్ ఫిల్మ్ నిర్మించనున్నట్టు సమాచారం. కథా చర్చలు జరుగుతున్నాయి.
* మెగా ప్రొడ్యూసర్ అశ్వినీదత్ వారసురాళ్లు స్వప్నాదత్ (Swapna Dutt), ప్రియాంకా దత్లు (Priyanka Dutt). నాన్న నిర్మిస్తున్న చిత్రాలకు సహకారం అందిస్తూనే ‘త్రీ ఏంజెల్స్’, ‘స్వప్న సినిమా’ పతాకాలపై సొంతంగా చిత్రాలు తీస్తున్నారు. త్వరలో రానున్న భారీ చిత్రాలు ‘సీతారామం, ప్రాజెక్ట్ కె’లలో నిర్మాణంలో వీళ్లది కీలక పాత్ర.
* అగ్ర నిర్మాత దిల్ రాజు కూతురు హన్షితారెడ్డి. నాన్న నిర్మిస్తున్న సినిమాల ప్రొడక్షన్ వ్యవహాలు ఎప్పట్నుంచో చూసుకుంటున్నారు. ఆయన హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్లో సొంత స్టూడియో నిర్మించనున్నట్టు సమాచారం. స్టూడియో నిర్మాణం పూర్తైన వెంటనే అన్ని బాధ్యతలు తనే తీసుకోనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్