Akshay Kumar: రామోజీ ఫిల్మ్‌సిటీలో అక్షయ్‌ సందడి

బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ ‘కన్నప్ప’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇప్పుడీ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Updated : 17 Apr 2024 12:06 IST

‘కన్నప్ప’ కోసం సెట్లోకి

బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌ కుమార్‌ ‘కన్నప్ప’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇప్పుడీ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఆయన తాజాగా ఈ సినిమా చిత్రీకరణ కోసం రంగంలోకి దిగినట్లు తెలియజేస్తూ మంగళవారం ఓ వీడియో పంచుకున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో సిద్ధం చేసిన ప్రత్యేక సెట్లో అక్షయ్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఆయన ఈ సినిమాలో శివుడి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. మంచు విష్ణు టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ తెరకెక్కిస్తున్నారు. మోహన్‌బాబు నిర్మాత. మోహన్‌లాల్‌, శివరాజ్‌కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక కథానాయకుడు ప్రభాస్‌ ఇందులో నందీశ్వరుడి పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం సాగుతోంది. త్వరలోనే ఆయన ఈ చిత్ర సెట్లోకి అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని