అనిల్‌ రావిపూడికి ఈరోజు చాలా స్పెషల్‌..!

టాలీవుడ్‌ దర్శకుడు అనిల్‌ రావిపూడికి ఈ రోజు చాలా స్పెషల్‌. కారణమేమిటంటే ఆయన దర్శకత్వం వహించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక సాయంత్రం జరగనున్న విషయం తెలిసిందే. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ సంబరాన్ని మరింత పెంచే విధంగా ఆయన సతీమణి..

Published : 05 Jan 2020 11:16 IST

ఒకపక్క సినిమా.. మరోపక్క ఫ్యామిలీ

హైదరాబాద్‌: టాలీవుడ్‌ దర్శకుడు అనిల్‌ రావిపూడికి ఈ రోజు చాలా స్పెషల్‌. కారణమేమిటంటే ఆయన దర్శకత్వం వహించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక ఈ రోజు సాయంత్రం జరగనున్న విషయం తెలిసిందే. అయితే ‘సరిలేరు నీకెవ్వరు’ సంబరాన్ని మరింత పెంచే విధంగా ఆయన సతీమణి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారట. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆయనకు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో మహేశ్‌ నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అలనాటి తార విజయశాంతి ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె ప్రొఫెసర్‌ భారతిగా కనిపించనున్నారు. దిల్‌రాజు, మహేశ్‌బాబు, అనిల్‌ సుంకర నిర్మాతలుగా వ్యవహరించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించారు. ఈ సినిమాలో మహేశ్‌కు జంటగా రష్మిక నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నిర్వహించనున్న ప్రీరిలీజ్‌ వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మరోవైపు ఈ సినిమా ట్రైలర్‌ను రాత్రి 9.09 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని