Guntur Kaaram: మహేశ్‌బాబు అభిమానులకు గుడ్‌న్యూస్‌.. ‘గుంటూరు కారం’ నుంచి అప్‌డేట్‌

Guntur Kaaram Update: మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ నుంచి అప్‌డేట్‌ వచ్చేసింది.

Published : 04 Nov 2023 17:37 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు (Mahesh Babu) కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి దసరా పండగల వేళ ఏదైనా అప్‌డేట్‌ వస్తుందేమోనని మహేశ్‌బాబు అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. కానీ, చిత్ర బృందం ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదు. అసలు అప్‌డేట్‌ ఇచ్చేంత సమయం కూడా లేకుండా షూటింగ్‌ చేస్తున్నామని చిత్ర నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ అన్నారు. దీంతో అభిమానులందరూ నిరాశపడ్డారు.

ఈ క్రమంలో దీపావళికి ముందే ‘గుంటూరు కారం’ సర్‌ప్రైజ్‌ను రెడీ చేసింది. ఈ చిత్రం నుంచి మొదటి లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా ఆదివారం ‘దమ్‌ మసాలా’ అంటూ సాగే పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీంతో మహేశ్‌బాబు అభిమానులు ఖుషీ అవున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక, హాసిని బ్యానర్‌పై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. జయం రవి, మీనాక్షి చౌదరి, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని