Lata Mangeshkar: లతా మంగేష్కర్‌ పాడిన తెలుగు పాటలివే!

భారతీయ సినీ సంగీత ప్రపంచంలోని సంగీత శిఖరం కూలిపోయింది. దిగ్గజ గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌ మృతి యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.

Published : 07 Feb 2022 01:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతీయ సినీ సంగీత ప్రపంచంలోని సంగీత శిఖరం నేలకొరిగింది. దిగ్గజ గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌ మృతి యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దాదాపు అన్ని భారతీయ భాషల్లో వేల సంఖ్యలో గీతాలను ఆలపించిన ఆమె, తెలుగులో మాత్రం చాలా తక్కువ పాటలు పాడారు.

1955లో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి నటించిన ‘సంతానం’ చిత్రంలో ఆమె తొలిసారి తెలుగు పాటను పాడారు. ‘నిదురపోరా తమ్ముడా’ అంటూ సాగే పాటకు సుసర్ల దక్షిణామూర్తి సంగీత దర్శకత్వం వహించారు. తర్వాత 1965లో ఎన్టీఆర్, జమునల ‘దొరికితే దొంగలు’ చిత్రంలో ‘శ్రీ వేంకటేశా’ పాటను పాడారు.  సాలూరి రాజేశ్వరరావు ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఇక 1988లో నాగార్జున, శ్రీదేవి జంటగా నటించగా ఇళయరాజా సంగీతమందించిన ‘ఆఖరి పోరాటం’ సినిమాలోని ‘తెల్లచీరకు’ పాటను గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి పాడారు. ఈ పాట ఇప్పటికీ  ఎప్పటికీ  ఎవర్‌గ్రీన్‌.

వీటితో పాటు ‘శ్రీదేవి’ సినిమాలో పాటలు పాడారు. యష్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీదేవి కథానాయికగా నటించగా, రిషి కపూర్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను తెలుగులో డబ్ చేయగా.. అందులో మూడు పాటలను లతా మంగేష్కర్ పాడారు. ఈ పాటలకు కూడా మంచి ఆదరణ దక్కింది. 1995లో ప్రేక్షకులను విశేషంగా అలరించిన చిత్రం ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’. ఇందులోఆమె పాడిన ‘తుఝే దేఖాతోయే జానా సనమ్’ భాషతో సంబంధం లేకుండా సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసింది. మరీ ముఖ్యంగా ఈ తరం శ్రోతలు లత గానానికి ఫిదా అయిపోయారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని