Attack: ఓటీటీలో జాన్‌ అబ్రహం ‘అటాక్‌: పార్ట్‌1’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

జాన్‌ అబ్రహం సూపర్‌సోల్జర్‌గా నటించిన చిత్రం ‘అటాక్‌: పార్ట్‌1’. ప్రకాష్‌రాజ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Published : 15 May 2022 01:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జాన్‌ అబ్రహం సూపర్‌సోల్జర్‌గా నటించిన చిత్రం ‘అటాక్‌: పార్ట్‌1’. ప్రకాష్‌రాజ్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రాణించలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ  జీ5లో మే 27 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

పూర్తి యాక్షన్‌ చిత్రంగా ‘అటాక్‌-1’ను తీర్చిదిద్దారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ(ఏఐ)సైనికుడు ఎలా ఉంటాడో ఇందులో చిత్రీకరించారు. చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఈ సినిమాకు నిర్మాతగానూ జాన్‌ అబ్రహం వ్యవహరించారు. కానీ, ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. లక్ష్య రాజ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు శశ్వంత్‌ సచ్‌దేవ్‌ సంగీతం అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని