Cinema News: సంక్షిప్త వార్తలు
నరసింహ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అమ్మాయిలు అర్థం కారు’. అల్లం శ్రీకాంత్, ప్రశాంత్, కమల్, మీరావలి కథానాయకులుగా నటించారు.
జీవితాల్ని తారుమారుచేసే డబ్బు
నరసింహ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అమ్మాయిలు అర్థం కారు’ (Ammayilu Ardham Karu). అల్లం శ్రీకాంత్, ప్రశాంత్, కమల్, మీరావలి కథానాయకులుగా నటించారు. సాయిదివ్య, ప్రియాంక, స్వాతి, శ్రావణి కథానాయికలు. నందిరెడ్డి విజయలక్ష్మిరెడ్డి, కర్ర వెంకటసుబ్బయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ, బసిరెడ్డి, ప్రసన్నకుమార్, మేడికొండ వెంకట మురళీకృష్ణ తదితర సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘‘మధ్య తరగతి జీవితాల్లో డబ్బు ఎలాంటి పాత్ర పోషిస్తుందో, దాంతో జీవితాలు ఎలా తారుమారవుతాయో ఇందులో చర్చించాం’’ అన్నారు దర్శకుడు.
‘అవతార్2’కి అవసరాల మాటలు
జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’. ఆ చిత్రానికి సీక్వెల్గా 13 ఏళ్ల తర్వాత ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (Avatar 2) ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో సిద్ధమైన ఈ చిత్రం ఈ నెల 16న తెలుగులోనూ విడుదలవుతోంది. తెలుగు సినిమాకి ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల (Srinivas Avasarala) మాటలు రాశారు.
శాసనసభతో కల నెరవేరింది
‘‘ఈ శుక్రవారం ‘అవతార్2’తో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంటుంది. ఆ పండగలో నా సినిమా కూడా భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా’’ అన్నారు ఇంద్రసేన. ‘కిక్2’, ‘ధృవ’, ‘సైరా నరసింహారెడ్డి’ తదితర చిత్రాల్లో కీలకపాత్రలు పోషించిన ఆయన కథానాయకుడిగా ‘శాసనసభ’ (Sasanasabha) తెరకెక్కింది. వేణు మడికంటి దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ఇంద్రసేన మంగళవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘పన్నెండేళ్లుగా పరిశ్రమలో కొనసాగుతూ... కొన్ని చిత్రాల్లో కీలకమైన పాత్రలు చేస్తూ వచ్చా. ఓ సినిమాలో నటిస్తున్నప్పుడు నాలుగు రోజులైనా సరే, సంభాషణ చెప్పే అవకాశం రాలేదు. అప్పుడే హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకోవాలనే పట్టుదల ఏర్పడింది. ఆ సందర్భంలోనే నన్ను ఎప్పట్నుంచో గమనిస్తున్న మిత్రుడు రాఘవేందర్రెడ్డి కలిసి తను సిద్ధం చేసిన ‘శాసనసభ’ కథ వినిపించారు. నాకు చాలా బాగా నచ్చింది. కథ విని నా మిత్రుడు షణ్ముగం ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఓ యువకుడు సంధించిన ప్రశ్నే ఈ చిత్రం’’.
* ‘‘దర్శకుడు సురేందర్ రెడ్డి నన్ను ప్రోత్సహించి పలు చిత్రాల్లో అవకాశాలు ఇచ్చారు. ఆయన దర్శకత్వం వహించిన ‘సైరా నరసింహారెడ్డి’లో యుద్ధ వీరుడిగా కనిపిస్తా. భవిష్యత్తులో నాకు యాక్షన్ హీరోగానే అవకాశాలు వస్తాయి. అంతగా ఈ సినిమా ప్రభావితం చేస్తుంది. రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్ తదితరులతో కలిసి నటించడం గొప్ప అనుభవం. నేను కన్న కల నెరవేరిన అనుభూతి కలిగింది.’’.
సుందరాంగుడి సెల్ఫీ
పాత్రను బట్టి ఆ గెటప్లోకి ఇట్టే మారిపోతారు ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్కుమార్ (Akshay Kumar). నిత్యం షూటింగులతో బిజీగా ఉండే ఆయన ఐదారు చిత్రాల్లో నటిస్తున్నారు. తాజాగా ‘సెల్ఫీ’ సినిమా సెట్లో సందడి చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఆ పాటకు సంబంధించిన ఓ ఫొటోను పంచుకుంటూ ఈ విషయాన్ని వెల్లడించారు అక్షయ్. ఆ ఫొటో చూసి నెటిజన్లు అక్షయ్ చాలా అందంగా ఉన్నారని, రొమాంటిక్ హీరో అని, సెల్ఫీ సుందర్ అని ఇలా రకరకాలుగా స్పందించారు. మలయాళ చిత్రం ‘డ్రైవింగ్ లైసెన్స్’కు ఇది హిందీ రీమేక్ ఇది. ఇమ్రాన్ హష్మీ మరో కీలక పాత్రలో నటిస్తోన్న రాజ్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ఫిబ్రవరి 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
టింగిల్ మింగిల్ అని పెట్టండి
తన భర్త రణ్బీర్కపూర్ నటిస్తున్న సినిమాకు ఓ కొత్త పేరు సూచించింది అలియాభట్ (Alia Bhatt). రణ్బీర్ కపూర్, శ్రద్ధాకపూర్ జంటగా లవ్ రంజన్ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా పేరుకు సంబంధించిన ‘టీజేఎమ్ఎమ్’ అంటూ నాలుగు అక్షరాలతో ఓ టైటిల్ను పెట్టింది చిత్రబృందం. దీన్నిబట్టి అసలు సినిమా పేరేంటో ఊహించండి అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. దీనికి నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. వాళ్లతో పాటు అలియా కూడా ఓ పేరుని సూచించింది. ‘టింగిల్ జింగిల్ మింగిల్ మింగిల్’ అని పెట్టండి రాసింది. అలియా ఫన్నీ కామెంట్పై కూడా నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆటపట్టించడం కాకపోతే సినిమా పేరేంటో అలియాకు చెప్పకుండా ఉంటాడా రణ్బీర్ పోస్టులు పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఓటీటీలోకి ‘డియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జి.వి.ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత