Guntur Karam: విరామం తర్వాత మళ్లీ మొదలు

నెల రోజుల విరామం తర్వాత ‘గుంటూరు కారం’ చిత్రీకరణ మళ్లీ మొదలైంది. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ప్రధాన తారాగణంపై గురువారం నుంచి కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. కథానాయకుడు మహేశ్‌బాబు ఒకట్రెండు రోజుల్లో సెట్లోకి అడుగు పెట్టనున్నట్టు సమాచారం.

Updated : 18 Aug 2023 14:01 IST

నెల రోజుల విరామం తర్వాత ‘గుంటూరు కారం’ చిత్రీకరణ మళ్లీ మొదలైంది. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ప్రధాన తారాగణంపై గురువారం నుంచి కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. కథానాయకుడు మహేశ్‌బాబు ఒకట్రెండు రోజుల్లో సెట్లోకి అడుగు పెట్టనున్నట్టు సమాచారం. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్‌ నుంచి కొత్త ఛాయాగ్రాహకుడు మనోజ్‌ పరమహంస రంగంలోకి దిగారు. పి.ఎస్‌.వినోద్‌ తప్పుకోవడంతో మనోజ్‌ ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నారు. జనవరి 13న విడుదలే లక్ష్యంగా సినిమా చిత్రీకరణ జరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని