maa oori polimera 2: ప్రేక్షకులు నన్ను కొట్టినంత పనిచేశారు: సత్యం రాజేశ్‌

ప్రేక్షకులు ఆశించినట్లుగానే ‘పొలిమేర2’ సిద్ధమైందని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని కథానాయకుడు సత్యం రాజేశ్‌ తెలిపారు.

Published : 06 May 2023 17:23 IST

హైదరాబాద్‌: సత్యం రాజేశ్‌, బాలాదిత్య కీలక పాత్రల్లో నటించిన క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘మా ఊరి పొలిమేర’. కరోనా సమయంలో ఓటీటీలో వచ్చిన ఈ మూవీ మంచి టాక్‌ను అందుకుంది. ఈ క్రమంలో దీనికి కొనసాగింపుగా ‘పొలిమేర2’ (polimera 2) తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా త్వరగా విడుదల చేయాలని ఓ రోజు ప్రేక్షకులు తనపై దాడి చేసినంత పనిచేశారని ఆ చిత్ర కథానాయకుడు సత్యం రాజేశ్ తెలిపారు. ప్రేక్షకులు ఆశించినట్లుగానే ‘పొలిమేర2’ సిద్ధమైందని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు. ఆ చిత్ర ప్రచారంలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టైటిల్ పోస్టర్‌ను లాంఛనంగా ఆవిష్కరించి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో శ్రీకృష్ణ క్రియేషన్స్ పతాకంపై గౌరికృష్ణ ‘పొలిమేర-2ను నిర్మించారు. మూఢనమ్మకాల నేపథ్యంగా గ్రామీణ ప్రాంతంలో జరిగే కథతో రూపొందించిన చిత్రంలో సత్యం రాజేశ్ తోపాటు డాక్టర్ కామాక్షి, గెటప్ శీను, రాకేందు మౌళి, అక్షత, బాలాదిత్య, రవివర్మ, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు.

‘మా ఊరి పొలిమేర’ రివ్యూ చదివారా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని