Mahesh Babu: లండన్‌లో మహేశ్‌బాబు డిన్నర్‌.. ఫొటోలు వైరల్‌

మహేశ్‌బాబు తన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి లండన్‌ వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను నమత్రా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Updated : 25 Jul 2023 09:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్రనటుడు మహేశ్‌బాబు (Mahesh Babu) కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారనే సంగతి తెలిసిందే. సినిమా చిత్రీకరణకు కాస్త విరామం దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే తన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి లండన్‌ వెళ్లారు. ఓ రెస్టారంట్‌లో డిన్నర్‌ చేశారు. సంబంధిత ఫొటోలను నమత్రా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘లండన్‌ కాలింగ్‌’ అని క్యాప్షన్‌ పెట్టారు. క్షణాల్లోనే అవి వైరల్‌గా మారాయి. వాటిల్లో మహేశ్‌ చిరునవ్వు చిందిస్తూ కనిపించారు. టీ షర్ట్‌లోనూ సూపర్‌గా ఉన్నారంటూ ఆయన అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అలాగే ఫొటోల్లో నమ్రత సిస్టర్‌ శిల్పా శిరోద్కర్‌ కూడా ఉన్నారు. ఆమె తెలుగులో ‘బ్రహ్మ’ సినిమాలో కనిపించి అలరించారు.

ట్రెండీ లుక్‌లో సమంత.. క్వీన్‌గా కాజల్‌.. తనయుడితో నయన్‌ ఆటలు

కొన్ని రోజుల నుంచి ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) షూటింగ్‌తో బిజీగా ఉన్న మహేశ్‌ కొన్ని రోజులు బ్రేక్‌ ఇచ్చినట్టు ఈ పోస్ట్‌తో అర్ధమవుతోంది. దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. శ్రీలీల (Sree Leela), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కథానాయికలు. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌- త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందుతోన్న సినిమాకావడంతో ‘గుంటూరు కారం’పై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని