Hyderabad: క్రమశిక్షణ తప్పని నటుడు మురళీమోహన్: వెంకయ్యనాయుడు
కళలు సమాజం మేలు కోరే విధంగా ఉండాలని మాజీ ఉపరాష్ర్టపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు.
హైదరాబాద్: కళలు సమాజం మేలు కోరే విధంగా ఉండాలని మాజీ ఉపరాష్ర్టపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. శనివారం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ప్రముఖ సినీ నటుడు, నిర్మాత మురళీమోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థాన అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమాజానికి దిశానిర్దేశం చేసే విధంగా దర్శకులు, నిర్మాతలు, కళాకారులు, చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంపై సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందని, మంచి సినిమాలు తీస్తే సమాజం అందులోని మంచిని అనుకరించడం ప్రారంభిస్తుందన్నారు. శంకరాభరణం లాంటి చలనచిత్రాలు ఎంతో మందిని సంగీతం నేర్చుకునే విధంగా ప్రోత్సహించాయని చెప్పారు. అన్నమయ్య లాంటివి ఆ పదకవితా పితామహుని కీర్తనల పట్ల ప్రజల్లో ఆసక్తిని పెంచాయన్నారు. సినిమా వ్యాపారమే.. కానీ, ఆ వ్యాపారం సమాజానికి మేలు చేసేదిగా ఉండాలని ఆకాంక్షించారు. ఇప్పటి తరానికి నచ్చే విధంగానే కాదు, తరతరాలు గుర్తు పెట్టుకునే విధంగా ఉండాలన్నారు.
50ఏళ్ల పాటు కొనసాగడం గొప్ప విషయం..
మురళీ మోహన్ సినీ జీవిత స్వర్ణోత్సవంలో పాల్గొనడం తనకు సంతోషంగా ఉందన్నారు. సినిమా రంగంలో 50ఏళ్ల పాటు కొనసాగడం గొప్ప విషయమన్నారు. క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, నిజాయతీకి ప్రాణమిచ్చే వ్యక్తిత్వం, ఎలాంటి పరిస్థితినైనా ఆనందంగా స్వీకరించే తత్వమే ఆయన అభ్యున్నతికి, ఆరోగ్యానికి కారణమన్నారు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా... తానో సగటు మనిషిని అని ఆయన అనుకుంటారని, అది చాలా మంచి లక్షణమని అన్నారు. మురళీమోహన్ నటన ఎంతో సహజంగా ఉంటుందని, ఇంట్లో వ్యక్తిలాగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారన్నారు. 50 ఏళ్ల క్రితం సినిమా రంగంలో ప్రవేశించినప్పుడు ఎలా ఉండేవారో.... ఇప్పటికీ అలానే ఉండటం జీవితంలో ఆయన పాటించే క్రమశిక్షణకు నిదర్శమని, ఆయన్ను చూస్తే ఎనిమిది పదులు నిండిన వ్యక్తిలా అనిపించరని తెలిపారు. వారు నటించిన, నిర్మించిన చిత్రాలు సందేశాత్మకంగా ఉండేవని అన్నారు.
అదీ మురళీమోహన్ ప్రత్యేకత: చంద్రబాబు
సినీ, రాజకీయరంగంలో మురళీమోహన్ తనకుంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ‘‘సినిమా రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం చిన్న విషయం కాదు. అలాంటి ఘనత సాధించిన అరుదైన వ్యక్తి మురళీమోహన్. 350 సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి చూస్తున్నా.. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తెదేపా తరఫున ప్రచారంలో పాల్గొనేవారు. ఆయన లేకుండా ఎన్నికలు లేవు. అదీ మురళీమోహన్ ప్రత్యేకత’’అని చంద్రబాబు అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, ఎంపీ రఘురామకృష్ణరాజు తదితరులు పాల్గొని ప్రసంగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
ముద్దు సన్నివేశాలకు నో చెప్పిన కారణంగా అవకాశాలు కోల్పోయినట్లు మృణాల్ ఠాకూర్ చెప్పారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
పేరు ఊరిస్తోంది
విజయవంతమైన కలయికల్ని పునరావృతం చేయడమన్నది చిత్రసీమలో తరచూ కనిపిస్తూనే ఉంటుంది. ఈ తరహావి ప్రేక్షకుల్లో అంచనాల్ని అమాంతం పెంచేస్తుంటాయి. అంతేకాదు ఇవి మార్కెట్ను బలంగా ప్రభావితం చేస్తుంటాయి. -
బంగారం అంటే మెరవాలా?
సమంత పునరాగమనం ఏ సినిమాతో అనేది ఖరారైంది. సొంత నిర్మాణంలోనే ఆ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇటీవలే ఆమె ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించిన విషయం తెలిసిందే. -
ఇక్కడ ఎవరికి వారే హీరో
‘‘స్వేచ్ఛ కోసం అందాన్ని సైతం ఆయుధంగా ఉపయోగించుకునే కళ ఈ బిబ్బోజాన్కు మాత్రమే తెలుసు’’ అంటూ ఇటీవలే ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని తన పాత్రను పరిచయం చేసింది అదితిరావ్ హైదరి. -
శరవేగంగా.. ‘ఐడెంటిటీ’
టోవినో థామస్, త్రిష జోడీగా అఖిల్ పాల్, అనాస్ఖాన్ తెరకెక్కిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఐడెంటిటీ’. ‘2018’ సంచలనం విజయం తర్వాత ఈ సినిమా వస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. మరోవైపు త్రిష నాయిక కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. -
‘థగ్లైఫ్’ గీత రచయితగా..
అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ విలక్షణమైన నటనతోనే కాదు.. దర్శక నిర్మాతగా, స్క్రిప్ట్ రచయితగా, గాయకుడిగానూ గతంలో మెప్పించారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘థగ్ లైఫ్’తో గీత రచయితగా మరోసారి ప్రయోగం చేశారు. -
రణ్వీర్తో త్వరలోనే..
హిందీ మొదలుకొని మలయాళం వరకూ అన్ని పరిశ్రమల తారల్నీ భాగం చేస్తూ తాను సినిమాల్ని చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు ప్రశాంత్వర్మ. సంచలన విజయం సాధించిన ‘హను-మాన్’ చిత్రంతోనే పీవీసీయూ (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) పేరుతో తనదైన కథల ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడం మొదలు పెట్టారు. -
కథ కుదిరింది
గతేడాది ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు సాయిదుర్గా తేజ్. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు కొత్త కబురు వినిపించలేదు. ఆ మధ్య సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రకటన వచ్చినా కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. -
థ్రిల్ ప్రాప్తిరస్తు
ప్రియదర్శి హీరోగా నటించనున్న కొత్త చిత్రం ఖరారైంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, శ్రీ వెంకటేశ్వర ఏషియన్ సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. -
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
‘దేవర’ సినిమా విషయంలో తనకెదురైన ప్రశ్నపై అల్లరి నరేశ్ స్పందించారు. -
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
నెగెటివ్ కామెంట్స్ను తాను పట్టించుకోనన్నారు నటి వరలక్ష్మీ శరత్కుమార్. -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్