ntr: చిరకాలం గుర్తుండే నాయకుడు ఎన్టీఆర్
‘‘తెలుగు సినిమా రంగంపై ఎన్టీఆర్ వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిది. ఆయన రాజకీయ రంగంలోనూ చిరకాలం గుర్తుండిపోయే నాయకుడు.
‘‘తెలుగు సినిమా రంగంపై ఎన్టీఆర్ వేసిన ముద్ర ఎప్పటికీ చెరిగిపోనిది. ఆయన రాజకీయ రంగంలోనూ చిరకాలం గుర్తుండిపోయే నాయకుడు. ఆయన చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల్ని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులూ కొనసాగించారు. అలా అన్ని రంగాల్లో స్ఫూర్తిని నింపి తెలుగు జాతి అభివృద్ధికి బాటలు వేశార’’న్నారు ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు. ఆయన గురువారం హైదరాబాద్లో నిర్వహించిన ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ‘మనదేశం’ 75ఏళ్ల విజయోత్సవ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్టీఆర్ సెంటీనరీ సెలబ్రేషన్స్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తొలి చిత్రమైన ‘మనదేశం’ నిర్మాత కృష్ణవేణి, ఆ చిత్ర దర్శకుడైన ఎల్వీ ప్రసాద్ తనయుడు రమేశ్ ప్రసాద్, పూర్ణా పిక్చర్స్ అధినేత విశ్వనాథ్లను ఈ వేదికపై సత్కరించారు. ఈ సందర్భంగా సెలబ్రేషన్స్ కమిటీ ఛైర్మన్ జనార్దన్ మాట్లాడుతూ ‘‘ఎంతోమంది నాయకులు వస్తారు, వెళతారు. కానీ ప్రజలకి సేవ చేసినవాళ్లే చిరకాలం గుర్తుంటారు. అలాంటి గొప్ప నాయకుడు ఎన్టీఆర్. 40ఏళ్ల తర్వాత దేశానికి ఎలాంటి అవసరాలు ఉంటాయో ముందే ఊహించి చెప్పిన గొప్ప దూరదృష్టి గల నేత ఆయన’’ అన్నారు. ఎన్టీఆర్ తనయుడు నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ ‘‘వజ్రాన్ని కూడా సానబట్టాలి. అలా ఎన్టీఆర్కు ‘మనదేశం’ సినిమాలో అవకాశం ఇచ్చి, ఆయనలోని నటుడికి మెరుగులు దిద్దిన గొప్ప దర్శకనిర్మాతలు ఎల్వీ ప్రసాద్, కృష్ణవేణి. వారికి మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంద’’న్నారు. ‘‘ఎన్టీఆర్ని మేం పరిచయం చేయడం ఎంతో గర్వంగా ఉంది. మేం నిర్మించిన ‘మనదేశం’ 75ఏళ్ల విజయోత్సవ వేడుకని నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు కృష్ణవేణి. ఈ కార్యక్రమంలో టి.ప్రసన్నకుమార్, హైదరాబాద్ మింట్ అధికారి శ్రీనివాస్, భగీరథ, దొప్పలపూడి రామమోహనరావు, అట్లూరి నారాయణరావు, విక్రమ్ పూల, మండవ సతీశ్, శ్రీపతి సతీశ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Mahesh babu: మహేశ్ జుట్టులాగి ఆటపట్టించిన మంజుల.. క్యూట్ మొమెంట్స్ వైరల్..
ఓ పెళ్లి వేడుకకు మహేశ్బాబు హాజరుకాగా, ఆయన సోదరి మంజుల ఆటపట్టించారు.
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
ముద్దు సన్నివేశాలకు నో చెప్పిన కారణంగా అవకాశాలు కోల్పోయినట్లు మృణాల్ ఠాకూర్ చెప్పారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
పేరు ఊరిస్తోంది
విజయవంతమైన కలయికల్ని పునరావృతం చేయడమన్నది చిత్రసీమలో తరచూ కనిపిస్తూనే ఉంటుంది. ఈ తరహావి ప్రేక్షకుల్లో అంచనాల్ని అమాంతం పెంచేస్తుంటాయి. అంతేకాదు ఇవి మార్కెట్ను బలంగా ప్రభావితం చేస్తుంటాయి. -
బంగారం అంటే మెరవాలా?
సమంత పునరాగమనం ఏ సినిమాతో అనేది ఖరారైంది. సొంత నిర్మాణంలోనే ఆ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇటీవలే ఆమె ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించిన విషయం తెలిసిందే. -
ఇక్కడ ఎవరికి వారే హీరో
‘‘స్వేచ్ఛ కోసం అందాన్ని సైతం ఆయుధంగా ఉపయోగించుకునే కళ ఈ బిబ్బోజాన్కు మాత్రమే తెలుసు’’ అంటూ ఇటీవలే ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని తన పాత్రను పరిచయం చేసింది అదితిరావ్ హైదరి. -
శరవేగంగా.. ‘ఐడెంటిటీ’
టోవినో థామస్, త్రిష జోడీగా అఖిల్ పాల్, అనాస్ఖాన్ తెరకెక్కిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఐడెంటిటీ’. ‘2018’ సంచలనం విజయం తర్వాత ఈ సినిమా వస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. మరోవైపు త్రిష నాయిక కావడం ఆసక్తి రేకెత్తిస్తోంది. -
‘థగ్లైఫ్’ గీత రచయితగా..
అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ విలక్షణమైన నటనతోనే కాదు.. దర్శక నిర్మాతగా, స్క్రిప్ట్ రచయితగా, గాయకుడిగానూ గతంలో మెప్పించారు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కుతున్న ‘థగ్ లైఫ్’తో గీత రచయితగా మరోసారి ప్రయోగం చేశారు. -
రణ్వీర్తో త్వరలోనే..
హిందీ మొదలుకొని మలయాళం వరకూ అన్ని పరిశ్రమల తారల్నీ భాగం చేస్తూ తాను సినిమాల్ని చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు ప్రశాంత్వర్మ. సంచలన విజయం సాధించిన ‘హను-మాన్’ చిత్రంతోనే పీవీసీయూ (ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్) పేరుతో తనదైన కథల ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించడం మొదలు పెట్టారు. -
కథ కుదిరింది
గతేడాది ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు సాయిదుర్గా తేజ్. ఆ తర్వాత మళ్లీ ఇంతవరకు కొత్త కబురు వినిపించలేదు. ఆ మధ్య సంపత్ నంది దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నట్లు ప్రకటన వచ్చినా కొన్ని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. -
థ్రిల్ ప్రాప్తిరస్తు
ప్రియదర్శి హీరోగా నటించనున్న కొత్త చిత్రం ఖరారైంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా, శ్రీ వెంకటేశ్వర ఏషియన్ సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలు సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాతో నవనీత్ శ్రీరామ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. -
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
‘దేవర’ సినిమా విషయంలో తనకెదురైన ప్రశ్నపై అల్లరి నరేశ్ స్పందించారు. -
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
నెగెటివ్ కామెంట్స్ను తాను పట్టించుకోనన్నారు నటి వరలక్ష్మీ శరత్కుమార్. -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్