Bheemla Nayak: పవన్ కల్యాణ్ కాదు ఎన్టీఆర్ సినిమా కోసం ఎదురుచూశారా? మంత్రి పేర్నినాని
పవన్ కల్యాణ్ గురించి కాదు ఎన్టీఆర్ సినిమా కోసం ఎప్పుడైనా ఎదురుచూశారా? అని ప్రశ్నించారు ఏపీ మంత్రి పేర్నినాని.
అమరావతి: పవన్ కల్యాణ్(Pawan kalyan) గురించి కాదు ఎన్టీఆర్ సినిమా కోసం ఎప్పుడైనా ఎదురుచూశారా? అని ప్రశ్నించారు ఏపీ మంత్రి పేర్నినాని. పవన్ కల్యాణ్ ‘భీమ్లా నాయక్’ చిత్ర విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందన్న ఆరోపణలపై స్పందించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘కొన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్లో బ్లాక్ మార్కెటింగ్ను ప్రోత్సహించాలనుకుంటున్నాయి. మరోవైపు, దాన్ని తప్పుబట్టాల్సిన టీవీ ఛానళ్లు కొన్ని ఒప్పుగా వార్తలను ప్రసారం చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన జీవోను తాత్కాలికంగా నిలిపి, జాయింట్ కలెక్టర్ల దగ్గర అనుమతి తీసుకోమని హైకోర్టు తీర్పునిచ్చింది. దానికి అనుగుణంగా మీరెందుకు చేయరు? మా ఇష్టారాజ్యం అంటే ఎలా కుదురుతుంది? ఈ నెల 21న టికెట్ ధరల విషయమై కమిటీతో భేటీ, 22న సినిమాటోగ్రఫీ హోం సెక్రటరీ జీవోకు ఓ డ్రాఫ్ట్ రూపొందించి, లా డిపార్ట్మెంట్కు పంపించటం, 23 లేదా 24న జీవో రావటం.. ఇదీ నేపథ్యం. మా మిత్రుడు, మంత్రి (గౌతమ్ రెడ్డి) మరణం కారణంగా ఆలస్యమైంది. మంచి మనిషిని కోల్పోయిన బాధలో మేం ఉంటే జీవో రావట్లేదంటూ కొందరు విమర్శిస్తున్నారు. చావును కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. అలాంటి వారిని ఏమనాలి?’’
‘‘గౌతమ్రెడ్డి మరణించిన రోజు ఒకలా మాట్లాడిన వారు తర్వాత రోజు నుంచి మరో విధంగా మాట్లాడుతున్నారు. రాజకీయం కోసం దిగజారే చంద్రబాబులాంటి వారికి మనిషి విలువ తెలియదు. ఎవరు చనిపోయినా వారి శవాలతో రాజకీయం చేస్తుంటారాయన. గౌతమ్రెడ్డి మరణం కారణంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ను వాయిదా వేసుకున్నవారు సినిమాను రెండు రోజులు పోస్ట్పోన్ చేసుకోలేరా? అలా జరగనప్పుడు ప్రస్తుతమున్న నిబంధనలే పరిగణనలోకి వస్తాయి. అంతెందుకు సినిమాను ఉచితంగా చూపిస్తామని అన్నారు కదా అలా చేయకుండా బ్లాక్లో టికెట్లు ఎందుకు విక్రయిస్తున్నారు. విడుదలవకముందే లోకేశ్ సినిమా బాగుంటుందని చెప్పుకొచ్చారు. సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నామన్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుంటే ఇలా ఎప్పుడైనా అన్నారా? పవన్ కల్యాణ్కు మాకూ వన్సైడ్ లవ్ ఉండదని చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. ఇప్పుడేం ఏం చెబుతారు?’’ అని ప్రశ్నించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు.