DilRaju: ఏ పార్టీలోకి వెళ్లినా నేను ఎంపీగా గెలుస్తా: దిల్ రాజు కీలక వ్యాఖ్యలు
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల నేపథ్యంలో దిల్రాజు (Dil Raju) తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తన ప్యానెల్ సభ్యులతో కలిసి ప్రెస్ ముందుకు వచ్చిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (TFCC) ఎన్నికల్లో ఈ సారి అధ్యక్షుడి పదవికి పోటీ పడుతున్నారు ప్రముఖ నిర్మాతలు దిల్రాజు, సి.కల్యాణ్. ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన ప్యానెల్ సభ్యులతో దిల్రాజు (Dil Raju) ప్రెస్ ముందుకు వచ్చారు. ఏ రాజకీయ పార్టీ తరఫున నిలబడినా తాను ఎంపీగా గెలుస్తానని చెప్పిన ఆయన.. తన ప్రాధాన్యత మాత్రం ఎప్పటికీ సినిమా రంగానికే ఉంటుందన్నారు. సీనియర్లు ముందుకు రాకపోవడంతోనే ఈ సారి తాను ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగినట్లు చెప్పారు. ఒకవేళ తాను అధ్యక్షుడిగా ఎన్నికైనా కిరీటాలు పెట్టరని, తనకు కొత్త సమస్యలు వచ్చినట్టేనని తెలిపారు. అయితే, సినీ పరిశ్రమ అభివృద్ధి, సంక్షేమం కోసమే తాను ఈ సారి ఎన్నికల్లో నిలబడినట్లు పేర్కొన్నారు.
‘‘ఈ ఎన్నికల పోటీలో ఎలాంటి వివాదాలు లేవు. ఫిల్మ్ ఛాంబర్ను బలోపేతం చేసేందుకే మేము ముందుకు వచ్చాం. పరిశ్రమలోని నాలుగు సెక్టార్లకు ఫిల్మ్ ఛాంబరే సుప్రీం. ప్రతి విభాగంలోనూ సమస్యలున్నాయి. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫామ్లో ఉన్న నిర్మాతలందరూ మా ప్యానెల్లో ఉన్నారు. దిల్రాజు ప్యానెల్ యాక్టివ్ ప్యానెల్. అలాగే, ఈ ఎన్నికలు మాకెంతో ప్రత్యేకం. ఎందుకంటే కొవిడ్ తర్వాత సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి. జులైలో ‘సామజవరగమన’, ‘బేబీ’ లాంటి చిన్న చిత్రాలు సినీ పరిశ్రమను కాపాడాయి. ఎగ్జిబిటర్లకు ప్రభుత్వాలతో కొన్ని సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించడానికి సరైన టీమ్ కావాలి. సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. సరైన పద్ధతిలో సినిమా షూటింగ్స్ జరగాలి. నటీనటులకు ఎలాంటి సమస్య వచ్చినా మా అసోసియేషన్తో సమన్వయం చేసుకోవాలి’’
‘‘తెలుగు సినిమా ఇప్పుడు ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ గుర్తింపును మరింత ముందుకు కొనసాగించాలి. 1560 మంది నిర్మాతలు సభ్యులుగా ఉన్నా రెగ్యులర్గా సినిమాలు తీసేవాళ్లు 200 మంది మాత్రమే. సినీ పరిశ్రమను బలోపేతం చేసుకోవాలంటే అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎవరినీ కించపర్చాలని మాకు లేదు. సత్యనారాయణ, అభిషేక్ నామా అంగీకరించకపోయినా వాళ్ల ఫోటోలను అవతలి ఫ్యానెల్ వాళ్లు ముద్రించుకున్నారు. ఇండస్ట్రీలో ఓటు రాజకీయం ఎక్కువ. నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్లో ఒక నిర్ణయం తీసుకోవడానికి సమస్య ఎదురైన సమయంలో యాక్టివ్గా 21 మంది సభ్యులతో గిల్డ్ ఏర్పాటు చేశాం. మిగతా 80 మంది అసోసియేట్ సభ్యులుగా ఉన్నారు. గిల్డ్ పై ఎన్ని విమర్శలు వచ్చినా మౌనంగా ఉన్నాం. ఫిల్మ్ ఛాంబర్ బైలాస్లో కొన్ని మార్పులు చేయాలి. ఛాంబర్లో సరైన వ్యక్తులు ఉంటేనే న్యాయం జరుగుతుంది’’ అని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్తో అలరించారో మీరూ చూసేయండి -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..