OTT: ఓటీటీల వల్ల దర్శకులకు ఈ టెన్షన్‌ తగ్గింది: రాజ్‌ అండ్‌ డీకే

దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే ఓటీటీలపై వారి అభిప్రాయాలను పంచుకున్నారు.

Published : 07 Mar 2024 12:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే. ఇప్పుడు ఓటీటీలో హవా కొనసాగిస్తున్నారు. తాజాగా వీళ్లిద్దరూ ఓ కార్యక్రమంలో ఓటీటీలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో షేర్‌ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే క్యారెక్ట్‌ర్‌ స్కెచ్‌ల కోసం ఏఐను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.

‘థియేటర్‌లో విడుదలయ్యే సినిమాలకు, ఓటీటీలో వచ్చే వాటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మేము మొదట సిరీస్ తీయాలనుకున్నప్పుడు ఓటీటీ సంస్థలు లేవు. నెట్‌ఫ్లిక్స్‌ ఇండియాకు రాలేదు. ఆ సమయంలో సిరీస్‌ను ప్రేక్షకులకు ఎలా అందించాలో అర్థం కాలేదు. అందుకే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు రాగానే మేమే మొదట అందులో సిరీస్‌ను విడుదల చేశాం. దీనికోసం ఏదైనా రూపొందించినప్పుడు కంటెంట్‌ విషయంలో రాజీ పడాల్సిన అవసరం ఉండదు. ఇన్ని గంటల్లోనే సిరీస్‌ను ముంగించాలి అనే టెన్షన్‌ ఉండదు. మన వద్ద ఉన్న కంటెంట్ మొత్తాన్ని ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించవచ్చు. అది 2 గంటలైనా కావొచ్చు.. 10 ఎపిసోడ్‌ల నిడివైనా ఉండొచ్చు. దేని గురించీ ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం అనుకుంటున్న కథను కుదించే పని లేకుండా తెరకెక్కించవచ్చు. మేము ఇప్పుడిప్పుడే ఏఐను ఉపయోగిస్తున్నాం. క్యారెక్టర్‌ రూపురేఖలు ఎలా ఉండాలో ఏఐ సాయంతో తీర్చిదిద్దుతున్నాం’ అని చెప్పారు.

పెళ్లి కాగానే మరో ప్రపంచానికి వచ్చినట్లనిపించింది: ఉపాసన

గతేడాది ‘ఫర్జీ’, ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’తో అలరించిన ఈ దర్శకులు ప్రస్తుతం ‘సిటడెల్‌’ (Citadel) వెబ్‌సిరీస్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రియాంక చోప్రా (Priyanka Chopra), రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించిన హాలీవుడ్‌ సిరీస్‌ తెలుగు వెర్షన్‌లో సమంత-వరుణ్‌ ధావన్‌లు నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని