Rashmika: ‘పుష్ప’ సినిమా నాకు దేశవ్యాప్త గుర్తింపు తెచ్చింది: రష్మిక

దక్షిణాది ముద్దుగుమ్మ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమైంది.

Published : 02 Oct 2022 10:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దక్షిణాది ముద్దుగుమ్మ రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. నార్త్‌లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆమె నటించిన ‘పుష్ప’ సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా జనాల్లో ఇంకా ఆ పాటలు, డైలాగ్‌ల సెన్సేషన్‌ తగ్గలేదు. నేషనల్‌ క్రష్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తన కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాల గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ‘‘నేను మొదట ఓ కన్నడ చిత్రంలో నటించాను. ఇక తెలుగులో విజయ్‌ సరసన నటించిన  ‘గీతాగోవిందం’ సినిమా అందరి దృష్టిని నావైపు తిరిగేలా చేసింది. ఆ తర్వాత ‘పుష్ప’ సినిమా నాకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది’’ అని చెప్పింది.

ఇక ‘పుష్ప’ విజయం గురించి మాట్లాడుతూ..‘ఈ సినిమాకు వచ్చిన స్పందన చూసి ఆశ్చర్యపోయాం. ఇంత పెద్ద హిట్‌ అవుతుందని అనుకోలేదు. నేను ఇంకా సంపూర్ణ నటిని కాలేదు. ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉంటాను’ అని చెప్పింది.

ప్రస్తుతం అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి ఆమె నటించిన ‘గుడ్‌బై’ సినిమా అక్టోబర్‌ 5న విడుదల కానుంది. ఈ చిత్రంతో రష్మిక బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయనుంది. వీటితో పాటు సిద్దార్థ్‌ మల్హోత్రా సరసన ‘మిషన్‌ మజ్ను’లో, రణబీర్ కపూర్‌ సరసన ‘యానిమల్‌’ చిత్రాల్లో నటిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని