Sai Dharam Tej: మావయ్య నుంచి నేర్చుకున్నది అదే!
మా మావయ్య పవన్కల్యాణ్. నేను నటుడిని కావడానికి సహకారం అందించింది, నన్ను ప్రోత్సహించింది ఆయనే. నేను గురువులా భావించే మావయ్యతో కలిసి నటించే అవకాశం రావడమే అన్నిటికంటే ప్రత్యేకం.
విజయాల బాటలో ప్రయాణం చేస్తున్న కథానాయకుడు సాయి ధరమ్ తేజ్. ‘విరూపాక్ష’తో ఘన విజయాన్ని అందుకున్న ఆయన... ఇటీవల తన మావయ్య పవన్కల్యాణ్తో కలిసి ‘బ్రో’లో నటించారు. మార్క్ అలియాస్ మార్కండేయగా ఆయన తెరపై సందడి చేయనున్నారు. చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా తేజ్ బుధవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
‘బ్రో’లో నటించడానికి మిమ్మల్ని ఎక్కువగా ప్రేరేపించిన అంశం ఏమిటి?
మా మావయ్య పవన్కల్యాణ్. నేను నటుడిని కావడానికి సహకారం అందించింది, నన్ను ప్రోత్సహించింది ఆయనే. నేను గురువులా భావించే మావయ్యతో కలిసి నటించే అవకాశం రావడమే అన్నిటికంటే ప్రత్యేకం. దాంతో కథ కూడా వినకుండా సినిమా చేయడానికి అంగీకారం తెలిపా. నన్ను నేను నిరూపించుకునే అవకాశంగా, నా కెరీర్కి నాకు నేను ఇచ్చుకునే ఓ కానుకగా భావించి నటించా.
పవన్కల్యాణ్తో కలిసి నటించిన తొలి రోజు అనుభవాల్ని పంచుకుంటారా?
నేనైతే కంగారుపడ్డాను. ఒక దశలో వణికిపోయాను. మావయ్య ‘నేనే కదా, ఎందుకు కంగారు పడుతున్నావు’ అంటూ నాతో మాట్లాడారు. దాంతో ఒత్తిడంతా మాయమైంది. దర్శకుడు సముద్రఖని కూడా చాలా సహకారం అందించారు. సెట్లో గడిపిన ప్రతిక్షణం గుర్తుండిపోయేదే. మావయ్యతో అన్ని రోజులు సమయం గడిపే అవకాశం వచ్చింది. సినిమా మొదలైనప్పట్నుంచి పూర్తయ్యేవరకూ నన్ను సరదాగా ఆటపట్టిస్తూనే ఉన్నారు. తెరపై కూడా మా ఇద్దరి మధ్య సన్నివేశాలు అలాగే ఉంటాయి. చిన్నప్పుడు కల్యాణ్ మావయ్యతోనే ఎక్కువ గడిపేవాణ్ని. దాంతో ఆయనతో ఓ ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. నాతో ఇప్పటికీ అలాగే ఉంటారు.
ఈ ప్రయాణంలో ఆయన్నుంచి నేర్చుకున్న ప్రత్యేకమైన విషయం ఏదైనా ఉందా?
ఆయన రాజకీయాల్లో కొనసాగుతూనే ఈ సినిమా చేశారు. బయట ఎన్ని ఒత్తిడులు ఉన్నా సరే, ఒక్కసారి సెట్కి వచ్చారంటే చేస్తున్న పాత్రే ఆయన ప్రపంచం అవుతుంది. బయట ఎన్ని పనులున్నా సరే, చేస్తున్న సన్నివేశానికి ఏం అవసరమో అది ఇవ్వడం ఎలాగో ఆయన్ను చూస్తూ నేర్చుకున్నా. వృత్తినీ, వ్యక్తిగత జీవితాన్నీ ఎలా వేరు చేసి చూడాలో తెలుసుకున్నా. ఈ సినిమా చిత్రీకరణ ఎంత వేగంగా సాగినా ఏ రోజూ ఒత్తిడిగా అనిపించలేదు. మావయ్యతో గడిపే సమయం నాకు చాలా విలువైనది.
ఈ కథ మీ వ్యక్తిగత జీవితంపై ఏ మేరకు ప్రభావం చూపించింది?
ఈ క్షణంలో బతకడం గురించి చెప్పే కథ ఇది. ప్రతి ఒక్కరికీ ఓ విధి ఉంటుందనీ... మన పనిని మనం చిత్తశుద్ధితో చేస్తూ వెళ్లాలని చెబుతుందీ కథ. వ్యక్తిగతంగా నాపైన ఈ సినిమా ప్రభావం అంటే... ఈ సినిమాకి ముందు నుంచే నాకు ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించడం అలవాటైంది. అందుకు సంబంధించిన పుస్తకాలు చదువుతూ ఉంటాను. టైమ్ విషయంలో మాత్రం చాలా కనెక్ట్ అయ్యాను. స్వతహాగా నేను నా కుటుంబంతో కలిసి సమయం గడపడాన్ని ఇష్టపడతాను. అమ్మ, నాన్న, స్నేహితులతో ఉదయమో, మధ్యాహ్నమో, రాత్రో ఏదో ఒక సమయంలో కలిసి కాసేపైనా గడుపుతా. ‘చిత్రలహరి’కి ముందు కొన్ని పరాజయాలు పలకరించాయి. నా పని అయిపోయిందని మాట్లాడుకున్నారు. ఆ సమయంలోనే చేసిన ‘చిత్రలహరి’ పరాజయాలపై నాకున్న అభిప్రాయాలన్నిటినీ మార్చేసింది.
త్రివిక్రమ్ ఏమైనా సలహాలు ఇచ్చారా?
ఆయన సెట్లో ఎప్పుడూ సలహాలు ఇవ్వలేదు. కథ పరంగా మాత్రం ఆయన చాలా సలహాలు ఇచ్చారు. త్రివిక్రమ్ లాంటి గొప్ప రచయిత రాసిన సన్నివేశాల్లో నేను నటించడం తృప్తినిచ్చింది. నాకూ, కల్యాణ్ మావయ్యకీ మధ్య సంభాషణలు కట్టిపడేసేలా ఉంటాయి. అవి తేలికైన పదాలతోనే ఉంటాయి, కానీ వాటిలో లోతైన భావం ఉంటుంది. తమన్ సంగీతం ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తుంది.
ఈ సినిమా తర్వాత కొన్నాళ్లు విరామం తీసుకుంటున్నారట కదా?
‘విరూపాక్ష’ తర్వాతే విరామం తీసుకోవాలనుకున్నా. అంతలోనే ‘బ్రో’ అవకాశం వచ్చింది. గత సినిమాకీ, ఈ సినిమాకీ చాలా మెరుగయ్యాను. మరో ఆరు నెలలు విశ్రాంతి తీసుకుని మరింత ధృఢంగా తిరిగి రావాలనుకుంటున్నా. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ‘గాంజా శంకర్’కి తగ్గట్టుగా నేను కనిపించాలంటే విశ్రాంతి అవసరం.
పవన్కల్యాణ్ మావయ్యతో కలిసి సినిమా చేస్తున్నానని చెప్పినప్పుడు మీ కుటుంబంలో ఎవరెలా స్పందించారు?
అందరూ చాలా సంతోషించారు. నాకు దక్కిన ఓ అదృష్టం అది. వరుణ్తేజ్ మొన్న వేడుకలో అలా అన్నా తను చాలా సంతోషించాడు. చిరంజీవి మావయ్య అయితే ‘మీ గురు శిష్యులకి బాగా కుదిరిందిరా’ అన్నారు.
కుటుంబ కథానాయకులతో కాకుండా... వేరే హీరోలతో కలిసి సినిమా చేయడానికి సిద్ధమేనా?
నాకు అందరు హీరోలతో కలిసి నటించాలని ఉంది. మా కుటుంబంలో కాకుండా నాకు బాగా ఇష్టమైన కథానాయకులంటే రవితేజ, ప్రభాస్, కల్యాణ్రామ్, తారక్. మంచి కథ కుదిరితే వీళ్లతో కలిసి నటిస్తా. మంచు మనోజ్తో కూడా సినిమా చేస్తా. మా మావయ్యలతో కలిసి నటించాలని నాకు ఎప్పట్నుంచో ఉండేది. నాగబాబు మావయ్యతో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలో నటించా. కల్యాణ్ మావయ్యతో ‘బ్రో’. ఇప్పుడు చిరంజీవి మావయ్యతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా.
‘‘బైక్ నడపడం అంటే నాకు ఇష్టం, అంతే కానీ వేగంగా వెళ్లడం కాదు. నేనెప్పుడూ బైక్పై నిదానంగానే వెళ్తా. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటుంటా. రోడ్డు ప్రమాదం తర్వాత మళ్లీ బైక్ ఎక్కా. ‘నా కొడుకు పిరికివాడిలా ఉండకూడదు, దేనికైతే భయపడ్డాడో... దాన్ని అధిగమించాలి’ అంటూ మా అమ్మ బైక్ తాళాలు తెచ్చి ఇచ్చింది. నేను అంతే ధైర్యంగా మా పార్కింగ్ స్థలంలోనూ.. అమ్మకి తెలియకుండా ఇంకొంచెం దూరం ప్రయాణం చేసి వచ్చా’’.
ప్రమాదం సమయంలో మిమ్మల్ని కాపాడిన అబ్దుల్ ఫర్హాన్కి ఏమైనా సాయం చేశారా?
సామాజిక మాధ్యమాల్లో దాని గురించి తప్పుడు ప్రచారం చేశారు. అతనికి కొంత డబ్బు ఇచ్చి చేతులు దులుపుకునే ఆలోచన నాకు లేదు. అతను నా ప్రాణాన్ని కాపాడాడు. అందుకే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనున్నానని చెప్పా. నెల కిందే అతన్ని కలిశా. నా బృందం ఎప్పుడూ అతనికి అందుబాటులో ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ప్రభాస్ ‘కల్కి’ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. -
మేకప్ రూమ్లో బంధించారు.. నిర్మాతపై నటి ఆరోపణలు
నిర్మాత వేధింపుల కారణంగా బాలీవుడ్ డ్రామా షో ‘శుభ్ షగున్’ నుంచి బయటకు వచ్చేసినట్లు నటి కృష్ణ ముఖర్జీ తెలిపారు. -
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
ప్రేమ స్వభావం ఎలా ఉన్నప్పటికీ దానిని వదులుకోవడం చాలా కష్టమన్నారు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
Gurucharan Singh: బాలీవుడ్లో ప్రముఖ టీవీ నటుడు ఐదు రోజులుగా కన్పించకుండా పోవడం చర్చనీయాంశమైంది. అతడిని కిడ్నాప్ చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
సర్వైవల్ థ్రిల్లర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
ఆ అవకాశం ఎప్పటికైనా వస్తుంది
హాలీవుడ్ నుంచి వచ్చిన అవకాశాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వదులుకున్నానంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. మళ్లీ కచ్చితంగా అవకాశం వస్తుందని, అది తన సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. -
పాట లేదు ఆట మాత్రమే!
ఒకవైపు ‘ఫ్యామిలీస్టార్’ గురించి చర్చ జరుగుతుండగానే... మరోవైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాతో బిజీ అయిపోయారు విజయ్ దేవరకొండ. -
అక్షయ్ కొత్త చిత్రం
‘బడే మియా ఛోటే మియా’తో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. -
ప్రేమ ‘పరదా’
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రధారిగా... ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘సినిమా బండి’ చిత్రంతో మెప్పించిన దర్శకుడీయన. -
అధునాతన సాంకేతికతతో..
సినిమా నిర్మాణానంతర పనులకి కావల్సిన అత్యాధునిక సాంకేతికతని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు శ్రీసారథి స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్.ఆర్.వి.ప్రసాద్. -
ఆడపిల్లనే! ఐతే ఏంటంట?
చాందిని చౌదరి ప్రధాన పాత్రలో ప్రకాష్ దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘యేవమ్’. నవదీప్, పవన్ గోపరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వశిష్ఠ సింహా, జై భారత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
శరవేగంగా ఓదెల 2
‘ఓదెల 2’తో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది తమన్నా. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. -
గెలుపే లక్ష్యమైతే ఆట ఎలా ఆడితే ఏంటి?
ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో రాఘవ్ ఓంకార్ శశిధర్ తెరకెక్కించిన చిత్రం ‘ది100’. రమేశ్ కరుటూరి, వెంకీ పూషడపు, జె.తారక్ రామ్ సంయుక్తంగా నిర్మించారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
‘నా ప్రత్యర్థి మోదీ.. సీఎం కాదు’: హిమంతకు ఖర్గే కౌంటర్
-
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్