Sivaji: నేను ఏ రాజకీయ పార్టీలో లేను.. ప్రజల గొంతుకగా ఉంటా!: నటుడు శివాజీ
‘#90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ (A Middle Class Biopic) ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో శివాజీ పాల్గొన్నారు. అందులో మాట్లాడుతూ తాను ఏ రాజకీయ పార్టీలోనూ లేనన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: తాను ఏ రాజకీయ పార్టీలో లేనని నటుడు శివాజీ అన్నారు. ఆయన ప్రధానపాత్రలో నటించిన వెబ్సిరీస్ ‘#90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ (A Middle Class Biopic). ఇది జనవరి 5వ తేదీ నుంచి ‘ఈటీవీ విన్’ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. తాజాగా దీని ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. అందులో పాల్గొన్న శివాజీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘నేను ప్రజల్లో ఉన్నానా.. రాజకీయాల్లో ఉన్నానా అనేది ముఖ్యం కాదు. ప్రజల్లో ఉంటే ప్రజల కోసం మాట్లాడతాం. రాజకీయాల్లో ఉంటే ఎవరో ఒకరినీ తిట్టాల్సి వస్తుంది. నేను ఒకప్పుడు భాజపాలో ఉన్నమాట వాస్తవమే. ఏపీ కోసం భాజపా ఇచ్చిన హామీలను విస్మరించడంతో నేను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాను. ఇప్పుడు ఏ రాజకీయపార్టీలోనూ లేను. ప్రజల గొంతుకగా ఉంటా. యువత భవిష్యత్తు, ప్రత్యేక హోదా కోసం పోరాడాను. ఈతరానికి రావాల్సిన వనరులు, మౌలిక సదుపాయాలు రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయి. ప్రజల్లో ప్రశ్నించే తత్వం పోయింది. పదేళ్లపాటు నేను ఏపీ కోసం పోరాడాను. మెగాస్టార్ కుటుంబానికి ఏపీలో భారీగా అభిమానులున్నారు. సీఎం అవ్వాలంటే మెగా కుటుంబానికి పెద్ద కష్టమేమీ కాదు. ఎక్కడో లోపం ఉంది. దాన్ని సరిదిద్దుకుంటే ఆ కుటుంబంలో ఒకరు సీఎం అవ్వొచ్చు’’ అని చెప్పారు.
‘‘ఈ వెబ్సిరీస్ కథ వినగానే ఓకే చెప్పాను. దీని షూటింగ్ మొదలుపెట్టే సమయానికి నాకు బిగ్బాస్లో అవకాశం వచ్చింది. ఆ కార్యక్రమానికి వెళ్లడానికి ముందే ఇది పూర్తి చేశా. నాకోసం దీని షూటింగ్ త్వరగా మొదలుపెట్టారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకూ ఒకేలా ఉన్నా. కొన్ని సందర్భాల్లో మనకు తెలియని వాళ్లు కూడా మన గురించి ఏవేవో మాట్లాడుకుంటారు. బిగ్బాస్లో నా క్యారెక్టర్ను అందరూ చూశారు. నేను రియల్ లైఫ్లో కూడా అలానే ఉంటాను. నాకు వచ్చింది నలుగురికి పంచే తత్వం. అది నాకు దగ్గరగా ఉండే వాళ్లకు తెలుసు. ఇండస్ట్రీకి వచ్చాక ఇన్ని సంవత్సరాలకు ‘శివన్నా’ అనే పేరుతో మంచి గుర్తింపు వచ్చింది. దీని వెనుక చాలా బాధలు, అవమానాలు ఉన్నాయి. ‘#90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ టీమ్లో వారంతా చాలా ప్రతిభావంతులు. ఈ సిరీస్ ETV WINను మరో స్థాయికి తీసుకువెళ్తుంది’’ అని శివాజీ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
‘హరోం హర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నారు సుధీర్ బాబు. ప్రస్తుతం ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. -
మరో ‘నరేంద్ర మోదీ బయోపిక్’.. ఈసారి యాక్టర్ ఎవరంటే?
ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా మరో సినిమా తెరకెక్కనుంది. -
సూర్య ‘కంగువా’.. పదివేల మందితో ఫైట్ సీక్వెన్స్!
‘కంగువా’ ఫైటింగ్ సీక్వెన్స్కు సంబంధించిన ఓ వార్త సోషల్మీడియాలో షేర్ అవుతోంది. -
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
ఓ నెటిజన్ పెట్టిన కామెంట్పై స్పందించిన రేణూదేశాయ్ ‘నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు?’ అని అసహనం వ్యక్తంచేశారు. -
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
రాజమౌళి-మహేశ్ల ప్రాజెక్ట్కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్గా మారింది. -
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
24 రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఆచూకీ లభించింది. -
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
‘హీరామండి’ చూసిన తర్వాత మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పినట్లు సోనాక్షి సిన్హా తెలిపారు. -
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘త్రినయని’తో పాటు పలు సీరియల్స్లో నటిస్తున్నారు. -
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శిఖర్ పహాడియాతో బంధంపై పెదవి విప్పిన జాన్వీ.. ఏమన్నారంటే!
మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహాడియాతో తన బంధం గురించి జాన్వీ మొదటిసారి స్పందించారు. -
ఆ వివాదంలోకి.. ఎన్టీఆర్ పేరుని తీసుకురావద్దు: టీమ్ విజ్ఞప్తి
టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ భూ వివాదంలో చిక్కుకున్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దానిపై టీమ్ స్పందించింది. -
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ల సినిమా టైటిల్ ఇదేనా!
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. -
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
ప్రభాస్ పెట్టిన ఇన్స్టా పోస్ట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదేంటంటే.. -
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని నటి ఈషా రెబ్బా అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
థియేటర్లలో సినిమాల ప్రదర్శనల నిలిపివేతపై జరుగుతున్న ప్రచారాన్ని టీఎఫ్పీసీ ఖండించింది. -
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
తనను పెళ్లి చేసుకోబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలను జాన్వీ వెల్లడించారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. -
‘భారతీయుడు 2’ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుందా.. వైరలవుతోన్న అప్డేట్స్
‘భారతీయుడు 2’ చిత్రబృందం సర్ప్రైజ్కు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. -
నా అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
Renu Desai: రూ.3500 కావాలంటూ రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్కు గాయమైంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.