Tollywood: ఈ జోరు కొనసాగనీ..
ఈ డిసెంబరు ఎంతో ప్రత్యేకం. ఎన్నడూ లేని విధంగా ఈ నెలలో కీలకమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.
బాక్సాఫీస్కి వసూళ్ల కళ
ఒక్కనెలలోనే రూ.వందల కోట్ల వ్యాపారం
ఈ డిసెంబరు ఎంతో ప్రత్యేకం. ఎన్నడూ లేని విధంగా ఈ నెలలో కీలకమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. సంక్రాంతి, వేసవిలాంటి సీజన్లని తలపించేలా రూ.వందల కోట్ల ముందస్తు వ్యాపార లావాదేవీలతో చిత్రసీమ తలమునకలైంది. కొన్ని నెలలుగా స్తబ్దుగా కనిపిస్తున్న తెలుగు సినిమా బాక్సాఫీసుకి ఇది మంచి పరిణామం. సినిమాకి క్లైమాక్స్లాంటి డిసెంబరు మాసం విజయాల్ని నమోదు చేసిందంటే వచ్చే సంక్రాంతికీ ఇది శుభసంకేతం అవుతుంది. మొన్న శుక్రవారమే వచ్చిన రణ్బీర్ ‘యానిమల్’ వసూళ్లతో ఇప్పటికే అదరగొడుతోంది. ఓ బాలీవుడ్ హీరో సినిమా ఈ స్థాయిలో వసూళ్లు సాధిస్తుండడం ఆషామాషీ కాదు. మరోవైపు రాబోయే సినిమాలు ప్రేక్షకుల్ని ఊరిస్తున్నాయి. ఈ జోరు ఈ నెలంతా కొనసాగిందంటే 2023 విజయవంతంగా ముగిసినట్టే.
సంఖ్యాపరంగా చూస్తే డిసెంబరులో డజనుకిపైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అనువాదాలు మొదలుకొని చిన్నాపెద్దా అన్నీ ఇందులో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల హక్కుల రూపంలో ఇవి దాదాపు రూ. 280 కోట్ల వ్యాపారం చేసినట్టు ట్రేడ్ వర్గాల లెక్క. ఇందులో ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘సలార్’ ప్రదర్శన హక్కులు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి సుమారు రూ.175 కోట్ల మొత్తానికి అమ్ముడైనట్టు తెలుస్తోంది.
సినిమాల దూకుడు
తొలి శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘యానిమల్’ సినిమా సంచలన విజయం దిశగా దూసుకెళుతోంది. తెలుగు స్టార్ల సినిమాలకి దీటుగా దీనికి ప్రారంభ వసూళ్లు దక్కాయి. అందుకు ప్రధాన కారణం దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ‘అర్జున్రెడ్డి’తో ఆయన ప్రేక్షకులపై చెరిగిపోని ముద్ర వేశారు. దాంతో ఆయన కొత్త సినిమాపై పెద్దఎత్తున అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ హీరో రణ్బీర్తో ఆయన జట్టు కట్టగానే దేశవ్యాప్తంగా సినిమాపై అంచనాలు పెరిగాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రభావం మరింతగా కనిపించింది. అందుకే తొలి ఆట నుంచే థియేటర్లు హోరెత్తాయి. పంపిణీ హక్కుల్ని తెలుగు రాష్ట్రాల్లో రూ.16 కోట్లకి దిల్రాజు సొంతం చేసుకోగా, తొలి రోజే రూ.15 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. తొలి వారాంతంలోనే రూ.35 నుంచి రూ.50 కోట్ల వరకూ గ్రాస్ వసూళ్లు రావొచ్చని దిల్రాజు అంచనా వేస్తున్నారు. రానున్న సినిమాల జోరు... ప్రేక్షకుల హుషారు ఇలాగే కొనసాగిందంటే ఈ నెలంతా బాక్సాఫీసు కళకళలాడటం ఖాయం.
భిన్నమైన కథలతో...
ఇక అందరి చూపూ రానున్న వారాల్లో విడుదలవుతున్న పక్కా తెలుగు సినిమాలపైనే. వచ్చే గురు, శుక్రవారాల్లో నాని ‘హాయ్ నాన్న’ చిత్రంతో, నితిన్ ‘ఎక్స్ట్రా- ఆర్డినరీమేన్’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇవి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ హక్కుల రూపంలో రూ.80 కోట్లకిపైగా వ్యాపారం చేసినట్టు అంచనా. నాని ‘హాయ్ నాన్న’ భావోద్వేగాలే ప్రధానంగా రూపొందిన ఓ ప్రేమకథ. శౌర్యువ్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించారు. నితిన్ ‘ఎక్స్ట్రా ఆర్డినరీమేన్’ నవ్వించడమే ప్రధానంగా రూపొందిన చిత్రం. డిసెంబరు 22న ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘సలార్’ పాన్ ఇండియా హంగులతో రూపొందిన చిత్రం. ఓ ప్రత్యేకమైన ప్రపంచం నేపథ్యంలో, యాక్షన్ ప్రధానంగా సాగుతుంది. ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కలయిక అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి, అంచనాలు మరో స్థాయిలో ఉంటాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమా స్థాయిని చాటింది. త్వరలోనే మరో ట్రైలర్ని విడుదల చేయనున్నట్టు సమాచారం. క్రిస్మస్కి ముందు షారుక్ ఖాన్ ‘డంకీ’తోపాటు, హాలీవుడ్ నుంచి ‘అక్వామ్యాన్ అండ్ ది లాస్ట్ కింగ్డమ్’ అనే చిత్రం వస్తోంది. మల్టీఫ్లెక్స్ ప్రేక్షకులు ఈ సినిమాల కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నారు. ఇవి కాకుండా ‘పిండం’, ‘బబుల్గమ్’, ‘జోరుగా హుషారుగా’ తదితర పరిమిత వ్యయంతో రూపొందిన తెలుగు సినిమాలూ ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
తన పారితోషికం గురించి నటుడు ఫహద్ ఫాజిల్ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. -
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన రణ్వీర్ సింగ్
రణ్వీర్ సింగ్ తన ఇన్స్టా నుంచి పెళ్లి ఫొటోలు తొలగించడం చర్చనీయాంశంగా మారింది. -
Arya: ‘అ అంటే అమలాపురం’.. 20 ఏళ్లయినా అదే గ్రేస్తో అదరగొట్టిన అభినయశ్రీ!
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) కెరీర్ను మలుపు తిప్పిన చిత్రంగా ‘ఆర్య’ నిలిచిపోతుంది. అప్పట్లో ఈ సినిమాలోని ‘‘అ అంటే అమలాపురం..’’ పాట యువతను ఉర్రూతలూగించింది. ఆ పాటలో అభినయశ్రీ తన డ్యాన్స్తో అదరగొట్టింది. తాజాగా నిర్వహించిన వేడుకలో ఆమె మరోసారి అదే పాటకు స్టెప్పులేసి అలరించింది.
-
Allu Arjun: ‘ఆర్య’.. నా కెరీర్ని ట్రాక్లోకి తీసుకొచ్చింది: అల్లుఅర్జున్
తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఆర్య’ ఓ మలుపు అని ప్రముఖ నటుడు అల్లుఅర్జున్ (Allu Arjun) అన్నారు. ఆయన కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్య’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మించారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చి 20 ఏళ్లయింది. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం రాత్రి హైదరాబాద్లో ప్రత్యేకంగా ఓ వేడుకని నిర్వహించింది.
-
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అదాశర్మ కీలక పాత్రలో నటించిన ‘బస్తర్’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. -
వి.వి. వినాయక్ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్
వి.వి వినాయక్ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. -
Pushpa: ‘పుష్ప’ ఫేమస్ డైలాగ్ వెనుక హరీశ్ శంకర్
Pushpa 2: The Rule: ‘పుష్ప’ ఫేమస్ డైలాగ్ వెనుక దర్శకుడు హరీశ్ శంకర్ ఉన్నారు. -
‘సలార్’లో పాత్రపై ఊహించని అప్డేట్ ఇచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్
‘సలార్’లో తన పాత్రపై పృథ్వీరాజ్ సుకుమారన్ అప్డేట్ ఇచ్చారు. దీంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. -
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్పెట్టారు. దానికి ఆమె రియాక్ట్ అయ్యారు. -
బాహుబలి విశ్వాన్ని మరింత విస్తరింపజేస్తాం
‘బాహుబలి’ సినిమాలతో సినీప్రియుల్ని అలరించారు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఇప్పుడీ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న యానిమేటెడ్ సిరీస్ ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’. దీనికి జీవన్ జె.కాంగ్, నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. -
ఊరిస్తున్న ఎన్టీఆర్
‘దేవర’ ప్రచార చిత్రాలతో సినీ ప్రియుల్ని అలరించారు ఎన్టీఆర్. ‘వార్ 2’ కోసం హిందీలోకి అడుగుపెట్టి.... ఆ కొత్త ప్రయాణం గురించీ ఆసక్తిగా మాట్లాడుకునేలా చేశారు. ఆయన పుట్టినరోజు దగ్గర పడుతుండడంతో మరోసారి ‘దేవర’ ప్రచార చిత్రాలు కానీ, పాటతో కానీ హంగామా చేయొచ్చని పరిశ్రమ, అభిమాన వర్గాల అంచనా. -
తెలుగు చిత్ర పరిశ్రమకి ఓ మలుపు... ఆర్య
‘‘తెలుగు సినిమా ఇలా కూడా ఉంటుందా అనిపించేలా అప్పట్లో ‘ఆర్య’ తీశారు సుకుమార్. ఎంతో మంది దర్శకులు... ఎన్నో మంచి చిత్రాలు ఈ సినిమా నుంచే వచ్చాయి. తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఆర్య’ ఓ మలుపు’’ అన్నారు అల్లు అర్జున్. -
మెరుపుల తార.. తళుకుల చీర
అందం, నటనతో అలరిస్తున్న బాలీవుడ్ అగ్రనాయిక అలియా భట్ ఈసారి ఆకట్టుకునే వస్త్రధారణతో అంతర్జాతీయ యవనికపై అలరించింది. ప్రఖ్యాత ఫ్యాషన్ వేదిక ‘మెట్ గలా’లో ఆమె చీరలో మెరిసింది. -
రోడ్లన్నీ గతుకులపాలే.. ఊరంతా చీకటిపాలే
ఓట్లు కొనేసి ఆ తర్వాత ప్రజల బాగుని మరిచే రాజకీయ నాయకుల్ని నమ్మొద్దని... గొర్రెల్లా కాకుండా మనిషిలా ఆలోచించి ఓటు వేయండని పిలుపునిస్తూ ‘కమిటీ కుర్రోళ్ళు’ పాటందుకున్నారు. మరి వారి ఆట పాట జనాల్లో ఎలాంటి మార్పుని తీసుకొచ్చిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
‘డియర్ స్టూడెంట్స్’ సందడి మొదలు
ఇటీవలే ‘డియర్ స్టూడెంట్స్’ అగ్రతార నయనతారకు స్వాగతం పలికారు. ఈమె, నివిన్ పౌలీ జంటగా నటిస్తున్న వినోదాత్మక చిత్రమిది. సందీప్ కుమార్, జార్జ్ ఫిలిప్రాయ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. -
జులై 20న.. కౌలాలంపూర్లో
తెలుగు సినిమా వైభవాన్ని... వారసత్వ పరంపరని చాటి చెప్పేలా 90 ఏళ్ల వేడుకని నిర్వహిస్తామని చెప్పారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. జులై 20న కౌలాలంపూర్, బుకిట్ జలీల్లోని ప్రతిష్ఠాత్మక నేషనల్ స్టేడియంలో ఈ వేడుకల్ని నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. -
తెరపై యుద్ధం.. ఖర్చు రూ.8కోట్లు
‘కార్తికేయ 2’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు నిఖిల్. ఇప్పుడు ‘స్వయంభూ’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. -
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అప్డేట్స్ మీకోసం.. -
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
ఇంకా చాలా వేదికల ద్వారా ‘బాహుబలి’ని తీసుకొస్తామని అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!