Satyadev: సవాల్ లేకపోతే సంతృప్తి దొరకదు
‘‘నాకెప్పుడు ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేయాలనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒకే తరహా పాత్రలు చేస్తే ప్రేక్షకులు తిడతారు. అందుకే వాళ్ల ఊహలకు అందని విధంగా ప్రతిసారి విభిన్నమైన పాత్రలతో అలరించే ప్రయత్నం చేస్తుంటా’’
‘‘నాకెప్పుడు ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేయాలనిపిస్తుంటుంది. ఎందుకంటే ఒకే తరహా పాత్రలు చేస్తే ప్రేక్షకులు తిడతారు. అందుకే వాళ్ల ఊహలకు అందని విధంగా ప్రతిసారి విభిన్నమైన పాత్రలతో అలరించే ప్రయత్నం చేస్తుంటా’’ అన్నారు కథానాయకుడు సత్యదేవ్. వైవిధ్యభరిత చిత్రాలకు చిరునామాగా నిలిచే ఆయన.. ఇప్పుడు ‘స్కైలాబ్’తో అలరించేందుకు సిద్ధమయ్యారు. నిత్యామేనన్ ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రమిది. విశ్వక్ ఖండేరావు తెరకెక్కించారు. రాహుల్ రామకృష్ణ మరో ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా ఈనెల 4న రానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు సత్యదేవ్.
‘‘నేను చేస్తున్న తొలి వినోదాత్మక చిత్రమిది. నాకు మొదటి నుంచీ ఇలాంటి సినిమా చేయాలనుండేది. స్వతహాగా నేను చాలా సరదా మనిషినే. కాకపోతే నా ఫేస్ కాస్త ఫన్కు అతీతంగా ఉంటుంది కాబట్టి
ఎక్కువగా సీరియస్ పాత్రలు చేస్తూ వచ్చాను. దీనికి తోడు సరైన కథ కూడా దొరక్కపోవడంతో ఇన్నాళ్లు ఆగాను. ఇన్నాళ్లకు ‘స్కైలాబ్’తో నా నిరీక్షణ ఫలించింది. ఇందులో ఫన్నీ పంచ్లు.. అవీ ఇవీ
ఉంటాయని చెప్పను కానీ, నా పాత్రే చాలా ఫన్నీగా ఉంటుంది. నేనిందులో ఆనంద్ అనే డాక్టర్గా కనిపిస్తా. బండలింగం పల్లిలో క్లినిక్ పెట్టాలనేది నా లక్ష్యం. అయితే స్కైలాబ్ పడబోతున్నప్పుడు.. దాన్ని వ్యాపారాత్మకంగా వాడుకొని ఎలా డబ్బు సంపాదించాలని ఆలోచించడం మొదలు పెడతా. మరి నా లక్ష్యం నెరవేరిందా? ఊర్లో క్లినిక్ పెట్టానా? లేదా? అన్నది తెరపై చూడాలి. ఇదొక సిచ్చువేషనల్ కామెడీ మూవీ’’.
* ‘‘సినిమాలో నాకు నిత్యాకు కాంబినేషన్ సీన్స్ ఏమీ లేవు. కానీ, ఇద్దరి కథలకి ఓ ఆసక్తికర కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది. రాహుల్ రామకృష్ణ పోషించిన సుబేదార్ రామారావు పాత్ర.. అలాగే బండలింగంపల్లి ఊరి జనాల పాత్రలు.. ఇలా ప్రతి పాత్రా వినోదం పంచుతుంది. పంచ్లు వేసి నవ్వించాలంటే కాస్త కష్టపడాలి కానీ, క్యారెక్టర్లోనే హ్యూమర్ ఉంటే.. మనం ఏం చేసినా ఫన్నీగానే ఉంటుంది. అందుకే ఈ సినిమా విషయంలో కామెడీ పండించడం పెద్ద కష్టమనిపించలేదు. ఈ సినిమా కోసం తొలిసారి తెలంగాణ యాసలో సంభాషణలు పలికా’’.
* ‘‘నేనెప్పుడూ ఛాలెంజింగ్ పాత్రల కోసమే ఎదురు చూస్తుంటా. ఎందుకంటే చేసే పాత్రల్లో సవాల్ లేకపోతే నటుడిగా సంతృప్తి దొరకదు. ప్రస్తుతం నేను చేస్తున్న సినిమాలన్నీ అలాంటివే. ‘గుర్తుందా శీతాకాలం’ నేను చేస్తున్న తొలి ప్రేమకథా చిత్రం. నేనందులో మూడు విభిన్నమైన లుక్స్లో కనిపిస్తా. ‘గాడ్సే’ ఓ థ్రిల్లర్ మూవీ. విద్యా వ్యవస్థపై సాగే ఆసక్తికర కథాంశతో రూపొందుతోంది. ఈ రెండు చిత్రాలు ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. అలాగే కొరటాల శివ బ్యానర్లో చేస్తున్న చిత్రం, అక్షయ్ కుమార్తో చేస్తున్న ‘రామ్ సేతు’.. ఇవన్నీ విభిన్న కథాంశాలతో రూపొందుతున్నవే’’.
* ‘‘నటుడిగా నేను సంతృప్తికర స్థితికి చేరుకోవడానికి ఇంకో 20 - 30ఏళ్లు పడుతుంది. ప్రస్తుతం కొత్త తరహా పాత్రలు చేయాలనే ఆకలితో ఉన్నా. ‘ఆపద్బాంధవుడు’లో చిరంజీవి చేసిన పాత్ర నుంచి ‘సూపర్ డీలక్స్’లో విజయ్ సేతుపతి పోషించిన పాత్ర వరకు నాకు చాలా డ్రీమ్ రోల్స్ ఉన్నాయి. అలాగే ‘నాయకుడు’లో కమల్ హాసన్ నటనని ఎంతో ఇష్టపడతా. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ఫాదర్’లో ఓ కీలక పాత్రలో నటించబోతున్నా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM