bigg boss 5: నామినేషన్స్లో ఉన్నది వీళ్లే.. ఇక నుంచి మిమ్మల్నే నామినేట్ చేస్తా!
తెలుగు రియాల్టీ షో బిగ్బాస్ సీజన్-5 ఆసక్తికరంగా సాగుతోంది. ఆరో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సోమవారం జరిగింది.
హైదరాబాద్: తెలుగు రియాల్టీ షో బిగ్బాస్ సీజన్-5 ఆసక్తికరంగా సాగుతోంది. ఆరో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సోమవారం జరిగింది. నామినేషన్స్ ముందు ఇంటి సభ్యులు తీవ్ర చర్చల్లో మునిగిపోయారు. ఎవరిని నామినేట్ చేయాలి? ఎందుకు నామినేట్ చేయాలి? ఏం కారణాలు చెప్పాలంటూ ఒకరినొకరు చర్చించుకున్నారు. ఇదే విషయాన్ని అనీ మాస్టర్ చెబుతూ ‘నామినేషన్స్ అనేసరికి అందరూ ఎంత బాగా చర్చించుకుంటున్నారో’ అని అన్నారు. ఇక కొత్త కెప్టెన్ ప్రియ, రేషన్ మేనేజర్ విశ్వల మధ్య ఫుడ్ విషయంలో చర్చ జరిగింది. రేషన్ మేనేజర్ అంటే అందరూ తిన్న తర్వాత తినాలని, వండిన ఆహారం అందరికీ సమానంగా పంచాలని ‘ప్రియోపదేశం’ చేసింది. అందుకు విశ్వ.. తనకు కావాల్సినది మాత్రమే తాను పెట్టుకున్నానని, ఇతరుల ఆహారం తానెందుకు తింటానని అన్నాడు. మరోవైపు హమీదా వెళ్లిపోయిన బాధ శ్రీరామ్ను వదల్లేదనుకుంటా. అర్ధరాత్రి నిద్రలో ఒకటే కలవరింతలు మొదలు పెట్టాడు. పెద్ద పెద్దగా అరవడంతో అతడికి ఏమైందా? అని కొందరు హౌస్మేట్స్ నిద్రలేచి చూశారు. విశ్వ అతడిని నిమురుతూ నిద్ర పుచ్చాడు.
మంట పెట్టిన బిగ్బాస్
గతవారం సీక్రెట్ నామినేషన్స్ చేసి, చివరిలో ఫలితాలు ప్రకటించిన బిగ్బాస్, ఈసారి నామినేషన్స్ సందర్భంగా హౌస్మేట్స్ మధ్య ‘మంట’ పెట్టాడు. హౌస్లో ఉండేందుకు అర్హత లేని, తమకు ఇష్టం లేని ఇద్దరు ఇంటి సభ్యుల ఫొటోలను మంటలో వేసి కాల్చేయాలని ఆదేశించాడు. నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టిన సన్నీ.. రవి, జెస్సీలను నామినేట్ చేశాడు.
అనీ మాస్టర్ Vs విశ్వ
ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న మీరు కష్టపడి పైకి వచ్చానని చెబుతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటూ తనని నామినేట్ చేయడం ఇష్టం లేదని అనీ మాస్టర్ను విశ్వ నామినేట్ చేశాడు. దీంతో అనీ మాస్టర్ ఆగ్రహంతో ఊగిపోయారు. ‘ఇక నుంచి నన్ను అక్కా.. తొక్కా అని పిలవద్దు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత ప్రియాంకను నామినేట్ చేశాడు. ఇక రాజుల టాస్క్ సందర్భంగా జెస్సీ, ప్రియాంకలు తన నమ్మకాన్ని వమ్ము చేశారంటూ లోబో వారిని నామినేట్ చేశాడు. తాను గేమ్ ఆడటానికి వచ్చానని లోబోకు జెస్సీ కౌంటర్ వేశాడు. శ్రీరామ్ కెప్టెన్గా ఉండగా, ఒకవైపే మాట్లాడాడని సిరి అతడిని నామినేట్ చేసింది. తర్వాత శ్వేత ఫొటోను మంటల్లో వేస్తూ.. ‘నా గేమ్ నా ఇష్టం, ఏం చేయాలో నువ్వు నాకు చెప్పకు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. లోబో, విశ్వలను ప్రియాంక నామినేట్ చేసింది. ‘చిన్న చిన్న కారణాలు చెప్పి నామినేట్ చేయడం, నమ్మకం గురించి మాట్లాడానికి సిగ్గుండాలి’ అంటూ లోబో ఫొటోను చించి మరీ మంటల్లో వేసింది. కండబలమే కాదు బుద్ధిబలం కూడా ఉపయోగించాలంటూ విశ్వకు సలహా ఇచ్చింది. వెధవ రీజన్లు ఇవ్వకండి అంటూ విశ్వపై మండిపడింది. ‘సరిగా మాట్లాడు’ అని విశ్వగా అనగా, ‘నా ఇష్టం’ అని అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అంటూ షణ్ముఖ్, విశ్వలను అనీ మాస్టర్ నామినేట్ చేసింది. ఇక్కడ కూడా విశ్వ-అనీల మధ్య వాగ్వాదం జరిగింది.
బిగ్బాస్కు నువ్వేమైనా దేవుడివా?
నామినేషన్స్ సందర్భంగా శ్రీరామ్, షణ్ముఖ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హౌస్మేట్స్ గురించి శ్రీరామ్ మాట్లాడుతూ.. అవసరానికి తగ్గట్టు బంధాలను వాడుకోవద్దని చెబుతూ సిరిని నామినేట్ చేశాడు. ఆ తర్వాత షణ్ముఖ్ను నామినేట్ చేసి, ఏదో చెప్పటానికి ప్రయత్నించగా, ‘అంటే బిగ్బాస్లో నువ్వు దేవుడివా. నువ్వు చెప్పినట్లు వినాలా’ అంటూ షన్ను ఫైర్ అయ్యాడు. చివరిగా కెప్టెన్ ప్రియ మరోసారి సన్నీని నామినేట్ చేసింది. బిగ్బాస్ మొదలైనప్పటి నుంచి ప్రియ వదలకుండా సన్నీని నామినేట్ చేస్తూనే ఉంది. ఈ వారం కూడా నామినేట్ చేయడంతో సన్నీ మొదట నవ్వుకున్నాడు. ఆ తర్వాత ‘మీరు హౌస్లో ఉన్నన్ని రోజులు 100శాతం మిమ్మల్ని నామినేట్ చేస్తా. ఇది గ్యారెంటీ’ అని ప్రియతో సన్నీ అనగా, ‘ఏంటి వార్నింగ్ ఇస్తున్నావా? బెదిరిస్తున్నావా’ అని ప్రియ అంది. ‘లేదు నా గేమ్ గురించి చెబుతున్నా. చూసుకోండి’ అన్నాడు. రేషన్ మేనేజర్ విశ్వను ప్రియ నామినేట్ చేసింది. అందరికీ పెట్టకముందే తినేస్తున్నావని, తనని మేకప్ వేసుకుని కూర్చుంటావని అన్నాడని అతడి ఫొటోను మంటల్లో వేసింది. 'నా కడుపు నా ఇష్టం' అంటూ విశ్వ మండి పడ్డాడు. ఇలా వాడీవేడీ చర్చల మధ్య ఈ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. షణ్ముఖ్, ప్రియాంక, లోబో, శ్రీరామ్, రవి, సిరి, విశ్వ, శ్వేత, సన్నీ, జెస్సీ నామినేట్ అయినట్లు బిగ్బాస్ ప్రకటించాడు. మరి ఈ వారం ఎవరు సేవ్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటీటీలోకి ‘డియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జి.వి.ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్