Bullettu Bandi: బుల్లెట్ బండి.. ఇలా వైరలైందండి..!
‘నువ్వు బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తావా.. అందాల ధునియానే చూపిస్తావా’ అంటూ ఇటీవల ఓ నవవధువు చేసిన డ్యాన్స్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. మంచిర్యాల జిల్లా గోదావరి ఖనికి చెందిన సాయి...
నవ వధువు డ్యాన్స్తో విపరీతమైన క్రేజ్
హైదరాబాద్: ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా.. అందాల దునియానే చూపిస్తపా’ అంటూ ఇటీవల ఓ నవవధువు చేసిన డ్యాన్స్ తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారిన విషయం తెలిసిందే. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సాయి అనే నవవధువు పెళ్లి అనంతరం భర్తను సర్ప్రైజ్ చేసేందుకు బరాత్లో ‘బుల్లెట్టు బండి’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్గా మారడం.. సాయి దంపతులకు ఫుల్ క్రేజ్ రావడం.. వెంట వెంటనే జరిగిపోయాయి. మరి, ఇంతటి క్రేజ్ సొంతం చేసుకున్న ‘బుల్లెట్టు బండి’ పాట పాడిందెవరు? ఒరిజినల్ సాంగ్ ఎలా ఉంటుంది? అనేది ఒక్కసారి తెలుసుకుందాం..!
బుల్లెట్టు బండి.. మన మోహనదేనండి..!
‘బుల్లెట్టు బండి’ ఒరిజినల్ పాట ఆలపించింది మన తెలుగింటి అమ్మాయి మోహన భోగరాజు. సంగీతంపై ఉన్న ఆసక్తి.. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ఆమె ప్లేబ్యాక్ సింగర్గా ఎదిగారు. కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం ఎదురుచూసిన మోహన ప్రస్తుతం వరుస పాటలతో అందర్నీ కట్టిపడేస్తున్నారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన ప్రతిభతో అందర్నీ ఆకర్షిస్తున్నారు. ‘బాహుబలి’లో ‘మనోహరి’, ‘భలే భలే మగాడివోయ్’ టైటిల్ సాంగ్, ‘అరవింద సమేత’లో ‘రెడ్డమ్మ తల్లి’తోపాటు ఇటీవల వచ్చిన ‘మగువా మగువా’ ఫీమేల్ వెర్షన్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
ఓ వైపు సినిమా పాటలతో అలరిస్తూనే సమయం దొరికినప్పుడల్లా ప్రైవేటు ఆల్బమ్స్ క్రియేట్ చేయడం మోహన అభిరుచి. ఈ ఏడాది ఏప్రిల్ 7న ఆమె ‘బుల్లెట్ బండి’ ప్రైవేట్ ఆల్బమ్ విడుదల చేశారు. లక్ష్మణ్ ఈ పాట రాశారు. మోహన కేవలం పాట పాడడమే కాకుండా దానికి అనువుగా డ్యాన్స్ చేసి మెప్పించారు. ఇప్పటి వరకూ ఈ పాటను 3.7 కోట్ల మంది వీక్షించారు. అయితే, ఒరిజినల్ వీడియో కంటే ఇటీవల నవవధువు సాయి చేసిన డ్యాన్స్ వీడియో వైరలయ్యాకే ఈ పాటకు మరింత క్రేజ్ పెరిగింది. దీంతో ఈ పాటకు సోషల్మీడియా కవర్ సాంగ్స్ వరుస కట్టాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మునుపటి మెరుపులు ఎప్పుడో!
ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి. -
విరామం తర్వాత జూన్లో సెట్లోకి
గతేడాది బ్లాక్బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథ
కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కరీనా
ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. -
19న డైరెక్టర్స్ డే వేడుకలు
‘‘‘దర్శకులకే కాకుండా... సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.