Rajinikanth: అందుకు నాకెంతో బాధగా ఉంది: రజనీకాంత్‌

సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు తనని వరించడం పట్ల అగ్రకథానాయకుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మరోసారి ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం దిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో...

Published : 24 Oct 2021 12:08 IST

హైదరాబాద్‌: సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు తనని వరించడం పట్ల అగ్రకథానాయకుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మరోసారి ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం దిల్లీలో నిర్వహించనున్న కార్యక్రమంలో రజనీకాంత్‌ ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం చెన్నైలోని తన నివాసం వద్ద రజనీ మీడియాతో మాట్లాడారు. ‘‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు వరించడం నాకెంతో ఆనందంగా ఉంది. ఆ అవార్డు నాకు వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. ఈ సమయంలో నా గురువు కె.బాలచందర్‌ మన మధ్య లేకపోవడం నాకెంతో బాధగా ఉంది’’ అని రజనీ తెలిపారు.

అనంతరం రజనీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రేపు తన జీవితంలో ఎంతో ప్రత్యేకమని అన్నారు. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును అందుకోవడంతోపాటు తన కుమార్తె సౌందర్య విఘ్నేశ్‌ ఎంతో శ్రమించి సిద్ధం చేసిన ‘హూట్‌ యాప్‌’ని తాను విడుదల చేయనున్నట్లు రజనీ తెలిపారు. మరోవైపు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును రజనీకాంత్‌కు ఇవ్వనున్నట్లు ఏప్రిల్‌ నెలలోనే కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కరోనా కారణంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం వాయిదా పడుతూ వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని