Sri Vishnu: ఆ కథలు చేయడం అంత సులభం కాదు
వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలు ఎంచుకుంటూ.. ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటారు కథానాయకుడు శ్రీవిష్ణు. అదే తన బలమంటారాయన. ఈ పంథాలోనే ఇటీవల ‘రాజ రాజ చోర’ చిత్రంతో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు.
వాస్తవికతకు దగ్గరగా ఉండే కథలు ఎంచుకుంటూ.. ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటారు కథానాయకుడు శ్రీవిష్ణు. అదే తన బలమంటారాయన. ఈ పంథాలోనే ఇటీవల ‘రాజ రాజ చోర’ చిత్రంతో చక్కటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడీ జోష్లోనే ‘అర్జున ఫల్గుణ’ సినిమాతో సినీప్రియుల ముందుకొస్తున్నారు. తేజ మార్ని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. ఈనెల 31న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు శ్రీవిష్ణు. ఆ సంగతులు ఆయన మాటల్లోనే..
‘‘గోదావరి జిల్లా బ్యాక్డ్రాప్లో సినిమా చేయాలని నాకెప్పటి నుంచో ఉండేది. నేనిప్పటి వరకు ఆ ఊరి బ్యాక్డ్రాప్ నుంచి సిటీకి వచ్చిన కథలు చేశా. పూర్తిగా ఆ గ్రామీణ నేపథ్యంలోనే సాగే కథ చేయలేదు. స్క్రిప్ట్ వింటున్నప్పుడే తేజ మార్నిలో మంచి దర్శకుడు కనిపించాడు. తేజ 55రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసి నాకు షాకిచ్చాడు. అంత తక్కువ రోజుల్లో ఇలాంటి చిత్రం చేయడం నిజంగా చాలా కష్టం. కచ్చితంగా తేజ చాలా పెద్ద దర్శకుడవుతాడు’’.
ఎవరికి వారే హీరో..
‘‘సినిమాలో ప్రతి పాత్రకు సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. నేను, అమృతా అయ్యర్, రంగస్థలం మహేష్, చైతన్య, చౌదరి స్నేహితులుగా కనిపిస్తాం. ఎవరికి వారు హీరో అన్నట్లుగానే చేశారు. అలాగే పెద్ద నరేశ్, శివాజీ రాజా, సుబ్బరాజు అద్భుతంగా నటించారు. సినిమా ప్రారంభమైన ఐదు నిమిషాల్లోనే ‘ముల్కల లంక’ అనే ఊర్లోకి వెళ్లిపోతారు ప్రేక్షకులు’’.
‘‘ప్రస్తుతం ‘భళా తందనాన’ సినిమా చేస్తున్నా. చాలా పెద్ద స్పాన్ ఉన్న యాక్షన్ డ్రామా చిత్రమిది. లక్కీ మీడియాలో ఓ చిత్రం చేస్తున్నా. కొందరు పోలీస్ ఆఫీసర్ల జీవితాల నుంచి అల్లుకున్న ఫిక్షనల్ బయోగ్రఫీ ఇది. ఇందులో ఐదు ఏజ్ గ్రూప్లుంటాయి’’.
బలహీనతగా భావించను
‘‘నేను పెద్దగా ప్రయోగాలేమీ చేయలేదు. కాకపోతే మామూలు కథనే కాస్త కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తుంటా. రియలిస్టిక్ కథలే నా బలం. దాన్ని బలహీనతగా ఎప్పుడూ భావించను. నిజానికి రియలిస్టిక్ చిత్రాలు చేయడం అంత ఈజీ కాదు. అలాంటి కథలు కెరీర్లో ఒకటో రెండో వస్తుంటాయి. నా దగ్గరకొచ్చిన ప్రతి కథనూ మరింత వాస్తవికంగా చెప్పే ప్రయత్నం చేస్తుంటా. అందుకే నా సినిమాలన్నీ చాలా సహజంగా ఉంటాయని అందరూ అంటుంటారు’’.
గోదావరి ఎటకారం
‘‘నర్సీపట్నంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశాం. డిగ్రీ అయిపోయి.. ఊర్లోనే ఉంటూ సంపాదించుకుందామనుకునే ఐదుగురు మిత్రుల కథ ఇది. వాళ్లు అనుకోని పరిస్థితుల్లో ఊరు దాటాల్సి వస్తుంది. దాని వల్ల అనుకోని సమస్యల్లో చిక్కుకుంటారు. మరి ఆ సమస్యేంటి? దాని నుంచి ఎలా బయటపడ్డారన్నది తెరపై చూడాలి. ఈ చిత్రంలో నేను పూర్తిగా గోదావరి యాసలోనే మాట్లాడతా. ఆ యాసలోని ఎటకారం కనిపిస్తుంది’’.
అందుకే ఆ టైటిల్..
‘‘అర్జున ఫల్గుణ’ అనేది భారతంలోని టాపిక్. అర్జుణ, ఫల్గుణ, పార్థ, కిరీటీ, కృష్ణ.. ఇలా ఓ పది పేర్లు తలచుకుంటే ధైర్యం వస్తుందని పురాణాల్లో చెప్పారు. రాను రాను అది అర్ణున, ఫల్గుణ వరకే చెప్పారు. ఉరుములు మెరుపులు వస్తే అందరూ ఆ పేర్లే తలచుకోమనేవారు. దాని వల్ల ధైర్యం వచ్చేది. అందుకే ఆ పేరులోని వైబ్రేషన్స్ నచ్చే ఈ టైటిల్ పెట్టాలనుకున్నాం. దానికి తోడు సినిమాలో నా పాత్ర పేరు అర్జున్. కథ రిత్యా ఈ పేరు సరిపోతుందనిపించి ఓకే చేశాం. నా ప్రతి చిత్రానికీ తెలుగు పేర్లు పెట్టేందుకే మొగ్గు చూపుతుంటా. మధ్య మధ్యలో సంస్కృత పదాలు పెడుతుంటాను. ఈతరం వాళ్లకు అర్జున ఫల్గుణ అనేది అంతగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ, ఒకరో ఇద్దరో ఇప్పుడీ చిత్రం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఓటీటీలోకి ‘డియర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
జి.వి.ప్రకాశ్ కుమార్, ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘డియర్’. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’.
తాజా వార్తలు (Latest News)
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్