Bholashankar: చిరుకు జోడీగా

మునుపెన్నడూ లేనంత వేగంగా సినిమాలు పట్టాలెక్కిస్తున్నారు కథా నాయకుడు చిరంజీవి. ప్రస్తుతం ఆయన నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రీకరణ దశలో ఉంది. కొత్తగా ‘భోళా శంకర్‌’ను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు

Updated : 30 Oct 2021 09:30 IST

మునుపెన్నడూ లేనంత వేగంగా సినిమాలు పట్టాలెక్కిస్తున్నారు కథా నాయకుడు చిరంజీవి. ప్రస్తుతం ఆయన నటించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రీకరణ దశలో ఉంది. కొత్తగా ‘భోళా శంకర్‌’ను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. మెహర్‌ రమేష్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. నవంబర్‌ 11న ఉదయం 7:45 గంటలకు లాంఛనంగా ప్రారంభమవుతుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం చుట్టూ తిరిగే కథతో రూపొందుతోన్న ఈ సినిమాలో.. చిరుకు చెల్లిగా కీర్తి సురేష్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు జోడీగా నటించే నాయికెవరన్నది ఖరారు కాలేదు. ఇప్పుడీ పాత్ర కోసం నటి తమన్నాను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే మిల్కీబ్యూటీతో కథా చర్చలు పూర్తయ్యాయని.. స్క్రిప్ట్‌ నచ్చడంతో సినిమా చేసేందుకు అంగీకారం తెలిపినట్లు తెలిసింది. ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ నవంబర్‌ 15 నుంచే ప్రారంభం కానుంది. తమన్నా గతంలో చిరుతో కలిసి ‘సైరా నరసింహారెడ్డి’లో నటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని