కేసీఆర్‌ నిర్ణయంపై మంచు విష్ణు ఆనందం

కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల నటుడు మంచు విష్ణు ఆనందం...

Published : 12 Apr 2021 16:48 IST

హైదరాబాద్‌: కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల నటుడు మంచు విష్ణు హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో ఉపాధ్యాయులందరూ ఎంతో సంతోషిస్తున్నారని అన్నారు. ఈ మేరకు  సోమవారం ఉదయం విష్ణు ఓ ట్వీట్‌ చేశారు. ‘కరోనా నేపథ్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రతినెలా వాళ్లకి రూ.2000 నగదు, 25 కిలోల బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయించడం ఓ అద్భుతం. ఈ నిర్ణయంతో విద్యారంగంలో ఉన్న ఎంతో మంది ఉపాధ్యాయులకు మీపై మరెంతో గౌరవం పెరిగింది’ అని విష్ణు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని