Tollywood: ఇంకో లడ్డూ ఉంది నాయనా
తెలుగు చిత్రసీమలో ఊహకు అందని కలయికల్లో సినిమాలు కుదురుతున్నాయి. ఏమాత్రం ప్రచారంలో లేకుండా... అనూహ్యంగా వెలుగులోకి వస్తూ... ఆరంభానికి ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చిరంజీవి - వెంకీ కుడుముల, ప్రభాస్ - మారుతి, రామ్ - బోయపాటి శ్రీను, ‘జనగణమన’ కోసం రెండోసారి కలుస్తున్న విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కలయికలే అందుకు తార్కాణం.
తెలుగు చిత్రసీమలో ఊహకు అందని కలయికల్లో సినిమాలు కుదురుతున్నాయి. ఏమాత్రం ప్రచారంలో లేకుండా... అనూహ్యంగా వెలుగులోకి వస్తూ... ఆరంభానికి ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చిరంజీవి - వెంకీ కుడుముల, ప్రభాస్ - మారుతి, రామ్ - బోయపాటి శ్రీను, ‘జనగణమన’ కోసం రెండోసారి కలుస్తున్న విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కలయికలే అందుకు తార్కాణం.
కరోనా వల్ల రాబోయే రెండు మూడేళ్లకి సరిపడా సినిమాలన్నీ ముందే ఖరారైపోయాయి. ఆయా హీరోలు, దర్శకులు ఎప్పుడు ఎవరితో కలిసి సినిమాలు చేయనున్నారు? ఎవరి ప్రయాణం ఎలా ఉంటుందనే విషయాల్లో ఇటు ప్రేక్షకులకీ, అటు పరిశ్రమ వర్గాలకీ స్పష్టంగా తెలుసు. హీరోలంతా ముందస్తుగా నాలుగైదు కథల్ని పక్కా చేసి, ప్రకటించడమే అందుకు కారణం. అయినా సరే... వీటి మధ్యలో అనూహ్యంగా కొత్త కలయికలు పుట్టుకొస్తూ ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అభిమానులకు లడ్డూ లాంటి నూతన తీపి కబుర్లు చెబుతున్నాయి.
మధ్యలో మరోటి..
కొత్త ప్రాజెక్టుల్ని ప్రకటించే విషయంలో ప్రభాస్ ముందు వరసలో ఉన్నారు. ‘రాధేశ్యామ్’, ‘సలార్’ చిత్రాలు చేస్తున్న దశలోనే వరుసగా కొత్త సినిమాల్ని ప్రకటించారు. ‘ఆదిపురుష్’తోపాటు, ‘ప్రాజెక్ట్ కె’, ‘స్పిరిట్’ సినిమాల్నీ పక్కా చేశారు. ప్రభాస్ నుంచి మరో కొత్త సినిమా ప్రకటన వెలువడాలంటే ఒకట్రెండేళ్లయినా పడుతుందని ఊహించారంతా. అనూహ్యంగా మారుతి దర్శకత్వంలో సినిమా చేయడానికి పచ్చజెండా ఊపేశారు. వీళ్ల కలయికలో సినిమాకి ‘రాజా డీలక్స్’ అనే పేరు ప్రచారంలో ఉంది. త్వరలోనే పట్టాలెక్కనున్న ఇది శరవేగంగా పూర్తిచేసే ఆలోచనలో చిత్రవర్గాలు ఉన్నట్టు తెలిసింది. విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ కలిసి ‘లైగర్’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ సినిమా చిత్రీకరణ పూర్తయింది. వెంటనే ఈ కలయికలో మరో సినిమా ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. ‘జనగణమన’ కోసం మరోసారి ఇద్దరూ చేతులు కలిపారు. నిజానికి విజయ్ దేవరకొండ ‘లైగర్’ తర్వాత సుకుమార్, శివ నిర్వాణ తదితర దర్శకులతో సినిమాలు చేయాల్సి ఉంది. ఆయన పూరితో కలిసే మరోసారి రంగంలోకి దిగనున్నారు.
చిరు జోరు
సీనియర్ హీరోల్లో చిరంజీవి జోరు కొనసాగుతోంది. ఆయనా వరుసగా నాలుగు సినిమాల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ‘ఆచార్య’, ‘భోళాశంకర్’, ‘గాడ్ఫాదర్’తోపాటు బాబీతో చేస్తున్న సినిమా. ఇలా... ఒకొక్క ప్రాజెక్ట్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. వాటి తర్వాత చిరు చేయబోయే సినిమా ఏమిటనే ఆలోచన ఎవ్వరికీ రాలేదు. ఆయన కొత్త ప్రాజెక్టుల విషయంలో జోరు కొనసాగిస్తూ యువ దర్శకుడు, తన అభిమాని అయిన వెంకీ కుడుములతో సినిమాకి పచ్చజెండా ఊపేశారు. ఈ కలయికలో సినిమాని డి.వి.వి.దానయ్య నిర్మించనున్నారు. ‘అఖండ’తో విజయాన్ని అందుకున్న బోయపాటి శ్రీను - యువ కథానాయకుడు రామ్ పోతినేని కలయిక అలా ఆసక్తిని రేకెత్తించేదే. ప్రేక్షకుల్లో ముందుగానే అంచనాల్ని పెంచేదే! ‘అఖండ’ తర్వాత బోయపాటి శ్రీను... అల్లు అర్జున్తో సినిమా చేస్తారనే ప్రచారం సాగింది. అయితే అల్లు అర్జున్ ‘పుష్ప2’ కోసం రంగంలోకి దిగుతుండడంతో ఆలోపు రామ్తో సినిమా కోసం రంగంలోకి దిగారు బోయపాటి. ఈ ప్రాజెక్ట్ని ఆయన తనదైన శైలిలో... పాన్ ఇండియా స్థాయిలో భారీగా రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.
కథానాయకులు ముందస్తుగా ఎన్ని సినిమాలు పక్కా చేసుకున్నప్పటికీ... ఆయా పరిస్థితులకి తగ్గట్టుగా మధ్యలో మార్పులు చేర్పులు జరగడం, అనూహ్యంగా కొత్త ప్రాజెక్టులు సెట్ కావడం తరచూ జరిగేదే. అలా రానున్న కాలంలోనూ కొత్త కలయికల్లో చిత్రాలను ఊహించొచ్చని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్తో అలరించారో మీరూ చూసేయండి -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ హీరో రజనీకాంత్, ప్రభాస్ కొత్త చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమన్నారంటే? -
మునుపటి మెరుపులు ఎప్పుడో!
ఒకప్పుడు వరుస అవకాశాలకి చిరునామాగా నిలిచారు. కొందరు అందంతోనూ... మరి కొందరు విజయాలతోనూ కట్టి పడేశారు. చిత్రసీమ దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించారు. భవిష్యత్తంతా వీళ్లదే అనుకునేలోపే పరాజయాలు ఎదురయ్యాయి. -
విరామం తర్వాత జూన్లో సెట్లోకి
గతేడాది బ్లాక్బస్టర్ హిట్లతో ప్రేక్షకులను అదరగొట్టారు బాలీవుడ్ అగ్రకథానాయకుడు షారుక్ ఖాన్. ఇప్పటి వరకూ ఆయన తదుపరి ప్రాజెక్టుల గురించి ఎలాంటి విషయాలు బయటికి రాలేదు. -
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కథ
కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమాని శనివారం అధికారికంగా ప్రకటించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా కథతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. -
యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కరీనా
ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. -
19న డైరెక్టర్స్ డే వేడుకలు
‘‘‘దర్శకులకే కాకుండా... సినీ పరిశ్రమలోని కార్మికుల్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు చొరవ చూపిన పరిశ్రమ పెద్ద దిక్కు దాసరి నారాయణరావు. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి’’ అన్నారు తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్. -
తెలుగుదనం ఉట్టిపడేలా... లగ్గం
‘పెళ్లి... షాదీ... లగ్గం... వివాహం... ఒక్కొక్క చోట ఒక్కో పిలుపు, ఒక్కో ఆచారం. కానీ మా ‘లగ్గం’ అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలనీ అలరిస్తుంది. వాళ్ల లగ్గమో, బంధువుల లగ్గమో గుర్తొచ్చేలా చేస్తుంద’ని చెబుతోంది చిత్రబృందం. -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి జంటగా నటించిన ‘రోమియో’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.
తాజా వార్తలు (Latest News)
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!