నవ్వించే బుల్లోడు వచ్చేస్తున్నాడు!

అల్లరి నరేష్‌ కథానాయకుడిగా, గిరి.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బంగారు బుల్లోడు’. పూజా ఝవేరి కథానాయిక. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. జనవరి 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.

Published : 13 Jan 2021 11:47 IST

హైదరాబాద్‌: అల్లరి నరేష్‌ కథానాయకుడిగా, గిరి.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బంగారు బుల్లోడు’. పూజా ఝవేరి కథానాయిక. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. జనవరి 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘అల్లరి నరేష్‌ కెరీర్‌లో మరో చక్కటి హాస్యభరిత చిత్రమిది. పేరొందిన పలువురు హాస్యనటులు ఇందులో కనిపిస్తారు. వాళ్లపై చిత్రీకరించిన సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయ’’ని సినీ వర్గాలు తెలిపాయి. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్, వెన్నెల కిశోర్, సత్యం రాజేశ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సతీష్‌ ముత్యాల, కూర్పు: ఎమ్‌.ఆర్‌.వర్మ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని