Urvashi Rautela: భారత్-పాక్‌ మ్యాచ్‌.. గోల్డ్‌ ఐఫోన్‌ పోగొట్టుకున్న ఊర్వశీ

ఇటీవల అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన భారత్‌-పాక్ మ్యాచ్‌కు బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతేలా హాజరై సందడి చేశారు. అయితే.. ఆమె అక్కడ తన ఫోన్‌ పోగొట్టుకున్నారు.

Updated : 16 Oct 2023 11:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్టోబర్‌ 14న అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు పలువురు సెలబ్రెటీలు హాజరై సందడి చేశారు. వారిలో బాలీవుడ్‌ హీరోయిన్‌ ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) కూడా ఉన్నారు. టీమ్‌ఇండియాను సపోర్టు చేస్తూ కనిపించారు. అయితే.. స్టేడియంలో తన ఖరీదైన ఫోన్‌ను పోగొట్టుకున్నట్లు ఆమె తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు.

అది 24 క్యారెట్ల గోల్డ్‌ ఐఫోన్‌ అని.. ఎవరికైనా దొరికితే తెలియజేయాలని కోరారు. అలాగే ఈ విషయంలో సాయం చేయాలని కోరుతూ అహ్మదాబాద్‌ పోలీసులను ట్యాగ్‌ చేశారు. పోలీసుస్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు. ఆమె పోస్ట్‌కు స్పందించిన పోలీసులు ఫోన్‌ వివరాలు చెప్పాలని రిప్లై ఇచ్చారు. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే ఊర్వశీ తన ఫోన్‌లో వీడియో తీసి అభిమానులతో పంచుకున్నారు. ఆ తర్వాత చాలామంది ప్రేక్షకులు ఆమెతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఆ సమయంలోనే ఫోన్‌ పోయి ఉండొచ్చని భావిస్తున్నారు. 

థియేటర్‌ దద్దరిల్లేలా ఈ దసరా.. బాక్సాఫీస్‌/ఓటీటీ చిత్రాలివే!

ఇక ఊర్వశీ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో వరుసగా ఐటెమ్‌ సాంగ్స్‌ చేస్తూ ప్రేక్షకులను ఊర్రూతలూగిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవితో కలిసి డ్యాన్స్‌ చేసిన ఊర్వశీ తాజాగా రామ్‌ ‘స్కంద’ సినిమాలోనూ ‘కల్ట్‌ మామా’ అంటూ అలరించారు. అలాగే  అఖిల్ ‘ఏజెంట్’, పవన్ కళ్యాణ్, సాయి తేజ్‌ల ‘బ్రో’ మూవీల్లోనూ తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని