Nayan-Vignesh: పెళ్లి ఫొటో షేర్‌ చేసిన విఘ్నేశ్‌

అభిమానులందరూ ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. నటి నయనతార, ఆమె ప్రియుడు, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహించిన ‘నేను రౌడీనే’ చిత్రంతో పరిచయమైన...

Updated : 09 Jun 2022 16:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహించిన ‘నేను రౌడీనే’ చిత్రంతో పరిచయమైన వీరిద్దరూ సుమారు ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం  మహాబలిపురంలోని ఓ ప్రముఖ హోటల్‌లో ఘనంగా జరిగింది. తమ వివాహబంధాన్ని తెలియజేస్తు తాజాగా విఘ్నేశ్‌ ఓ ఫొటో షేర్‌ చేశారు. మంగళసూత్రధారణ అనంతరం విఘ్నేశ్‌ ప్రేమగా ముద్దాడగా.. నయన మురిసిపోయారు. ‘‘ఆన్‌ ఏ స్కేల్‌ ఆఫ్‌ 10.. ఆమె తొమ్మిది నేను ఒకటి... దేవుడు, విశ్వం, మీ అందరి ఆశీస్సులతో మేము వివాహబంధంలోకి అడుగుపెట్టాం’’ అని విఘ్నేశ్‌ రాసుకొచ్చారు. అది చూసిన నెటిజన్లు నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

మంగళసూత్రం అందించిన రజనీ

కోలీవుడ్‌, బాలీవుడ్‌ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకల్లో భాగమయ్యారు.  హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన వీరి వివాహంలో ఓ నయనానందకర విషయం చోటుచేసుకుంది. తన అభిమాన హీరోగా ఆరాధించే రజనీకాంత్‌ చేతుల మీదగా విఘ్నేశ్‌ మంగళసూత్రం అందుకుని.. ప్రియసఖి నయనతార మెడలో మూడుముళ్లు వేశారు. ఈ ఘట్టాన్ని వీక్షించిన అతిథులందరూ ఆనందంతో మురిసిపోయారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని