Tollywood: నాగచైతన్య చిత్రం ప్రారంభం
మరోసారి జోడీ కట్టారు నాగచైతన్య, కృతిశెట్టి. ‘బంగార్రాజు’తో సందడి చేసిన ఈ ఇద్దరూ నాయకానాయికలుగా..
మరోసారి జోడీ కట్టారు నాగచైతన్య(Naga Chaitanya), కృతిశెట్టి (Krithi Shetty). ‘బంగార్రాజు’తో(Bangarraju) సందడి చేసిన ఈ ఇద్దరూ నాయకానాయికలుగా... వెంకట్ ప్రభు(Venkat Prabhu) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్కుమార్ సమర్పకులు. నాగచైతన్య నటిస్తున్న 22వ చిత్రమిది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. గురువారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైంది. నాయకానాయికలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu) క్లాప్నివ్వగా, కథానాయకుడు రానా దగ్గుబాటి(Rana) కెమెరా స్విచ్చాన్ చేశారు. ప్రముఖ నటుడు, దర్శకుడు భారతీరాజా, దర్శకుడు ఎన్.లింగుస్వామి, నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ చిత్రబృందానికి స్క్రిప్ట్ని అందజేశారు. కథానాయకుడు శివకార్తికేయన్, సినీ ప్రముఖులు గంగై అమరన్, యువన్ శంకర్రాజా, ప్రేమ్జీ ఈ వేడుకకి హాజరయ్యారు. ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సంగీత దర్శకులుగా ఈ ఇద్దరూ కలిసి పనిచేస్తున్న తొలి చిత్రమిదే. ‘‘అత్యున్నత సాంకేతిక హంగులతో రూపొందుతున్న చిత్రమిది. జులై నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి అబ్బూరి రవి మాటలు అందిస్తున్నారు.
ఆకట్టుకునే అరుదైన కథ ఇది
విష్వక్ సేన్ (Vishwak sen), ఐశ్వర్య అర్జున్(Aishwarya) జంటగా ప్రముఖ నటుడు అర్జున్ (Arjun) స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మిస్తున్నారు. ఇందులో జగపతిబాబు(Jagapathi Babu) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా గురువారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి పవన్ కల్యాణ్(Pawan Kalyan) క్లాప్ కొట్టారు. ప్రకాశ్ రాజ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. మంచు విష్ణు స్క్రిప్ట్ అందించారు. అనంతరం జరిగిన విలేకర్ల సమావేశంలో దర్శక నిర్మాత అర్జున్ మాట్లాడుతూ ‘‘1984లో ఓ తెలుగు సినిమా అవకాశం వస్తే చేయనని చెప్పా. దర్శకుడు కారణం అడిగితే.. ‘‘దర్శకుడిగా ఇది నా 13వ సినిమా. నిర్మాతగా 15వ చిత్రం. మంచి ఫీల్ గుడ్ ఎంటర్టైనర్లా ఉంటుంది. చాలా అరుదైన జానర్. ఈ కథ చెప్పగానే మరో ఆలోచన లేకుండా నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్ చేస్తామన్నారు. విష్వక్ అద్భుతమైన హీరో’’ అన్నారు. ‘‘అర్జున్ సర్ కలవాలని అడిగితే షాకయ్యా. ఎందుకో అర్థం కాలేదు. ‘నేను డైరెక్ట్ చేస్తున్న కథ చెప్తా విను’ అన్నారు. చాలా ఆశ్చర్యపోయా. అంత గొప్ప కథ’’ అన్నారు హీరో విష్వక్ సేన్. ‘మా’(MAA) ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి పోటీపడిన ప్రకాశ్రాజ్ (Prakash Raj), మంచు విష్ణుల(Manchu Vishnu) మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమంలో ఇద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకున్నారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేశాయి. ఈ కార్యక్రమంలో సాయిమాధవ్ బుర్రా, బీవీఎస్ఎన్ ప్రసాద్, రఫి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
సిద్ధార్థ్ మల్హోత్రా-రాశీఖన్నా ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘యోధ’ ఓటీటీలోకి వచ్చేసింది. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM