జులై 3, 4 తేదీల్లో ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ వార్షికోత్సవాలు
సాహిత్య, సంగీత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, నాటక రంగాల్లో, సుమారు 24 కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి, తనకంటూ
సింగపూర్: సాహిత్య, సంగీత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, నాటక రంగాల్లో, సుమారు 24 కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సింగపూర్కు చెందిన ప్రవాస తెలుగు సంస్థ ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’. సంస్థ ఏర్పాటై ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలో అత్యంత ఘనంగా వార్షికోత్సవాలను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా జులై 3, 4 తేదీల్లో ‘అంతర్జాతీయ సాంస్కృతిక సమ్మేళనం 2021’ అనే బృహత్ కార్యానికి శ్రీకారం చుట్టింది.
ప్రపంచ నలుమూలల్లో వివిధ దేశాల్లోని తెలుగువారి ప్రతిభకు పట్టం కట్టే విధంగా, అన్ని దేశాల తెలుగు కళాకారులు ఒక కార్యక్రమం ద్వారా అందరికీ పరిచయమయ్యే విధంగా దీన్ని తీర్చిదిద్దనున్నారు. సుమారు 34 దేశాల నుండి 45 తెలుగు సంస్థలు ఇందుకు సహకారం అందించనున్నాయి. అమెరికాలోని తానా, వంగూరి ఫౌండేషన్ వంటి ప్రముఖ సంస్థలతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, హాంకాంగ్, కువైట్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ కింగ్డమ్, నార్వే, దక్షిణాఫ్రికా, ఫ్రాన్స్, కెనడా, మారిషస్ మొదలైన 34 దేశాల నుంచి తెలుగు కళాకారులు రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు తమ అనుగ్రహభాషణం ఇవ్వనుండటం ఈ సారి ప్రత్యేకత.
సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ ‘భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమానికి ప్రారంభోపన్యాసం చేస్తారని, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు సామవేదం షణ్ముఖశర్మ, గరికిపాటి నరసింహారావు ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయనున్నారని వెల్లడించారు. రామ్ మాధవ్, మండలి బుద్ధ ప్రసాద్ , జేడీ లక్ష్మీనారాయణ, వామరాజు సత్యమూర్తి , వంగూరి చిట్టెన్ రాజు, వంశీ రామరాజు వంటి పెద్దలు కూడా కార్యక్రమానికి విచ్చేసి ప్రసంగిస్తారని రత్నకుమార్ తెలిపారు. వీరితో పాటు, సురేఖ మూర్తి, ఎల్లా వెంకటేశ్వరరావు, మాండోలిన్ రాజేష్, నేమాని పార్థసారథి వంటి సంగీత దిగ్గజాలు, తనికెళ్ళ భరణి, భువనచంద్ర, మురళీ మోహన్, సాయి కుమార్, సాలూరు కోటి వంటి సినీ ప్రముఖులు ఈ ప్రపంచ వేదికను అలంకరించనున్నారు. రాధిక మంగిపూడి, చామిరాజు రామాంజనేయులు కార్యక్రమ ముఖ్య సమన్వయకర్తలుగా, ఊలపల్లి భాస్కర్, గణేశ్న రాధాకృష్ణ ముఖ్య సాంకేతిక నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు. ‘శుభోదయం’ సంస్థ స్పాన్సర్గా, సింగపూర్ తెలుగు టీవీ, ఈ క్షణం, మా గల్ఫ్, మొదలైన వారు మీడియా పార్ట్నర్స్గా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా రెండు రోజులపాటు యూట్యూబ్, ఫేస్బుక్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానుందని కవుటూరి రత్నకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు.