పింగళి కుమార్తెకు మహాత్మాగాంధీ వంశీ-శుభోదయం అవార్డు
‘వంశీ ఇంటర్నేషనల్’ ఇండియా, శుభోదయం గ్రూప్-ఇండియా, సంయుక్త ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి అంతర్జాలంలో అద్భుతంగా జరిగింది.
‘వంశీ ఇంటర్నేషనల్’ ఇండియా, శుభోదయం గ్రూప్-ఇండియా, సంయుక్త ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతి అంతర్జాలంలో అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా మన జాతీయజెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మికి ‘మహాత్మాగాంధీ వంశీ-శుభోదయం అవార్డు-2021’ని అందించారు. మాచర్లలోని వారి స్వగృహంలో ఆమె కుమారులు జి.వి.ఎన్. నరసింహం ఆధ్వర్యంలో ఈ వేడుక కన్నులపండుగగా నిర్వహించారు. వంశీ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు, లయన్ డా॥ లక్ష్మీప్రసాద్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శుభోదయం గ్రూప్ నిర్వహణలో శోభాయమానంగా జరిగిన ఈ కార్యక్రమంలో 5 ఖండాల నుంచి జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొని జాతిపితకు ఘననివాళి అర్పించారు.
ప్రముఖనటి, మాజీ పార్లమెంటు సభ్యురాలు జమున రమణారావు మాట్లాడుతూ తన చిన్నతనంలో గాంధీ మహాత్ముని చూశానని, అప్పటి విశేషాలు పంచుకున్నారు. గాంధీక్షేత్రం అవనిగడ్డ నుంచి మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ ‘నేటి యువతకు మహాత్ముని ప్రబోధాలు తెలియ చెప్పవలసిన అవసరం ఉంద’న్నారు. ప్రొఫెసర్ ప్రసాద్ గొల్లనపల్లి (మేనేజింగ్ ట్రస్టీ గాంధీ కింగ్ ఫౌండేషన్), డా॥ సుద్దాల అశోక్తేజ, మాధవపెద్ది సురేష్, రేలంగి నరసింహారావు, భువనచంద్ర, ఉపేంద్ర చివుకుల (కమిషనర్, న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ యుటిలిటి అండ్ ఫార్మర్ న్యూజెర్సీ అసెంబ్లీమాన్, అమెరికా), డా॥ చిట్టెన్రాజు వంగూరి (అధ్యక్షులు, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా), డా॥ ప్రసాద్ తోటకూర (ఫౌండర్ చైర్మన్, మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ అమెరికా), డా॥ శ్రీరామ్ శొంఠి (వైస్ ప్రెసిడెంట్, గాంధీ మెమోరియల్ చికాగో), శ్రీనివాస్ గూడూరు (బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, తెలంగాణా తెలుగు అసోసియేషన్, వెంకట్ ఎక్కా (నేషనల్ కో-ఆర్డినేటర్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్), శ్రీదేవి జాగర్లమూడి (తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, న్యూజెర్సీ), డా॥ హరి ఇప్పనపల్లి (చైర్మన్, లీడ్ ఇండియా ఫౌండేషన్), గుణసుందరి కొమ్మారెడ్డి (అమెరికా), లలితారామ్ (అమెరికా), రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), జయ పీసపాటి (హాంగ్కాంగ్), డా॥ జొన్నలగడ్డ మూర్తి (యు.కె.), సత్యాదేవి మల్లుల (మలేషియా), అనిల్కుమార్ కడించెర్ల (ఒమాన్), వెంకట సురేష్ (యుఎఇ), తాతాజీ ఉసిరికల (ఖతార్), వెంకటేశ్వరరావు తోటకూర (బోట్స్వానా), రాజేశ్ ఎక్కలి (అమెరికా), జి. కృష్ణకిరణ్ (సౌత్ ఆఫ్రికా), జి. ప్రియాంక (న్యూజిలాండ్), టి. శైలూష (రియాద్), జి. కృష్ణ ప్రవీణ్, ఎమ్. ఛాయాదేవి, జి. వెంకటేశ్వరి, ఆర్. శైలజ, జి. గోపీకృష్ణ, ఎస్. ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.
వి.ఆర్.ఆర్. పద్మజ (ఖతార్), బొమ్మన గౌరీదేవి (ఖతార్), డా॥ తెన్నేటి సుధ, శైలజ సుంకరపల్లి పాల్గొన్న ఈ కార్యక్రమానికి రాధిక మంగిపూడి (సింగపూర్) వ్యాఖ్యాతగా వ్యవహరించారు. రామాంతపూర్ పబ్లిక్ స్కూలుకు చెందిన 6వ తరగతి విద్యార్థిని అనఘదత్త రామరాజు ప్రార్థనాగీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా Trinet live టి.వి., శుభోదయం మీడియా ద్వారా ప్రేక్షకులు ఈ కార్యక్రమం వీక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!