Foreign Jobs: విదేశీ కొలువుల కలలు ఖల్లాస్..
విదేశీ కొలువుల కోసం తప్పుడు పత్రాలు సమర్పిస్తున్న వారిపై అమెరికా అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. గతంలో కంటే భిన్నంగా ఇప్పుడు అభ్యర్థులు అందజేస్తున్న అనుభవ, రుణ ధ్రువీకరణ, బ్యాంక్ బ్యాలెన్స్ పత్రాలను ప్రైవేటు సంస్థల ద్వారా క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
తప్పుడు ధ్రువపత్రాలతో పట్టుబడుతున్న విద్యార్థులు
అమెరికన్ ఎంబసీ అంతర్గత విచారణతో బహిర్గతం
తెలుగు రాష్ట్రాల్లో దిల్లీ పోలీసుల దాడులు, అరెస్టులు
ఈనాడు, హైదరాబాద్: విదేశీ కొలువుల కోసం తప్పుడు పత్రాలు సమర్పిస్తున్న వారిపై అమెరికా అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. గతంలో కంటే భిన్నంగా ఇప్పుడు అభ్యర్థులు అందజేస్తున్న అనుభవ, రుణ ధ్రువీకరణ, బ్యాంక్ బ్యాలెన్స్ పత్రాలను ప్రైవేటు సంస్థల ద్వారా క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. వాటి నిబద్ధతనూ తనిఖీ చేస్తోండటంతో అక్రమార్కుల బండారం బయటపడుతోంది. వీసా ఇంటర్వ్యూలకు వెళ్లినప్పుడే ఈ నకిలీ పత్రాల గుట్టు రట్టవుతోంది. సమర్పించిన పత్రాలు నకిలీవనడానికి తాము సేకరించిన ఆధారాలను అధికారులు వారి ముందు పెడుతుండటంతో కళ్లు తేలేయటం అభ్యర్థుల వంతవుతోంది. దిల్లీలోని అమెరికన్(యూఎస్) ఎంబసీలో మార్చి 24 నుంచి ఈ నెల 10 వరకూ ఇంటర్వ్యూలకు హాజరైన వారిలో నకిలీ పత్రాలిచ్చిన వారిపై.. ఎంబసీ సహాయ ప్రాంతీయ భద్రత అధికారి కోరీ ఎం.థామస్ దిల్లీ చాణక్యపురి పోలీసుఠాణాలో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు, కన్సల్టెన్సీలు, సహకరించిన ఏజెంట్లపై కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో దిల్లీ పోలీసులు మూడు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో దాడులు జరిపి పలువురిని అరెస్ట్ చేశారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తుండటంతో ఇంకొందరి పేర్లు బహిర్గతమయ్యే అవకాశముంది.
రూ.24 లక్షలున్నట్లు బ్యాంకు బ్యాలెన్స్ పత్రాలు
హైదరాబాద్కు చెందిన ఓ అభ్యర్థి నాన్-ఇమ్మిగ్రెంట్ స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎర్రగడ్డలోని వెర్టెక్స్ నెట్కామ్ సొల్యూషన్స్లో నెలకు రూ.18వేల వేతనంతో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నట్లు వీసా ప్రాసెసింగ్ సమయంలో చెప్పాడు. అదే సంస్థ నుంచి ఇంటర్న్షిప్ లెటర్, మహారాష్ట్ర నాందేడ్లోని గోదావరి అర్బన్ మల్టీస్టేట్ క్రెడిట్ కో-ఆపరేటివ్ బ్యాంకు పాస్బుక్, గత మార్చి 30నాటికి ఆ ఖాతాలో రూ.24,17,110 నిల్వ ఉన్నట్లు చూపాడు. ఈ నెల 8న యూఎస్ ఎంబసీలో జరిగిన ఇంటర్వ్యూలో మాత్రం తన తప్పిదాలను అంగీకరించాడు. వెర్టెక్స్ సంస్థలో తానెప్పుడూ పనిచేయలేదని తెలిపాడు. డీఎఫ్ఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఏజెంట్ అసీర్ సూచన మేరకు గౌస్ అనే వ్యక్తికి రూ.3వేలు ఇవ్వడంతో వెర్టెక్స్ సంస్థ పేరిట తప్పుడు ధ్రువీకరణ పత్రాలిచ్చారని తెలిపాడు. రవి, నర్సింగ్లకు రూ.20 వేలిస్తే బ్యాంకు ఖాతాలో నగదు నిల్వ పత్రాలు ఇచ్చారని అంగీకరించాడు.
ఐటీ మేనేజర్నంటూ తప్పుడు సమాచారం
వరంగల్కు చెందిన మరో అభ్యర్థి 2017 సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకూ సాఫ్ట్టెక్ కంప్యూటర్స్లో ఇంజినీర్గా పనిచేస్తున్నట్లు వీసా దరఖాస్తులో పేర్కొన్నాడు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ నుంచి రూ.25 లక్షల రుణం మంజూరైందని, తన ఖాతాలో రూ.25,02,500 నగదు ఉందని కూడా పేర్కొన్నాడు. కానీ, ఈ నెల 5న జరిగిన వీసా ఇంటర్వ్యూ సందర్భంగా తాను సాఫ్ట్టెక్లో పనిచేయలేదని అంగీకరించాడు. రూ.5వేలు తీసుకొని మధుమిత దండె ఈ పత్రాలన్నీ సమకూర్చిందని ఒప్పుకొన్నాడు.
రూ.4వేలిస్తే సరి.. తప్పుడు ఉద్యోగ ధ్రువపత్రం
వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తికి చెందిన మరో అభ్యర్థి సాఫ్ట్టెక్ కంప్యూటర్స్లో పైథాన్ కోర్సు పూర్తిచేసినట్లు పేర్కొన్నాడు. కాన్సులేట్ దర్యాప్తులో అతను ఇచ్చిన ధ్రువపత్రం నకిలీదని వెల్లడైంది. హనుమకొండలోని సాఫ్ట్టెక్ సంస్థ డైరెక్టర్ మధుమిత దండే ఈ ధ్రువపత్రం ఇచ్చినట్లు కాన్సులేట్ ఇంటర్వ్యూలోనే వెల్లడించాడు. ఇందుకు రూ.4వేలు చెల్లించానన్నాడు.
నిందిత ఏజెంట్లు..
* వెంకటకిషోర్ వడ్లమూడి (వి1 ఓవర్సీస్ కన్సల్టెన్సీ, అనూశ్రీ ప్లాజా, లక్ష్మీపురం- గుంటూరు)
* కేశవ (స్ప్రింగ్ఫీల్డ్ ఓవర్సీస్ కన్సల్టెంట్స్, లోహియా టవర్స్, నిర్మల కాన్వెంట్ రోడ్ - విజయవాడ)
* అసీర్ (డీఎఫ్ఎస్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, నాయక్స్ పృథ్వీ గోల్డెన్ టవర్స్, విద్యానగర్ - హైదరాబాద్)
* రంగనాథ్ ముమ్మడి (బి-బెస్ట్ కన్సల్టెన్సీ, రెవెన్యూ కాలనీ - గుంటూరు)
* సోనియా, ప్రసన్న (ఇయెక్ కన్సల్టెంట్స్, గురుపుత్ర ఎస్టేట్స్- హైదరాబాద్)
* తిగుళ్ల ఉదయ్గౌడ్ (బ్లూ రిబ్బన్ ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్, మెరిక్స్ స్క్వేర్, సుచిత్ర సర్కిల్ - హైదరాబాద్)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM