Himanta Biswa Sarma: విపక్షాల ఇండియా.. ట్విటర్లో మార్పు చేసిన హిమంత: కాంగ్రెస్ కౌంటర్
ప్రతిపక్షాల కూటమి నిర్ణయించిన ఇండియా పేరు ప్రకటన అనంతరం అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ(Himanta Biswa Sarma) తన ట్విటర్ ఖాతాలో మార్పు చేశారు. హిమంత నుంచి వచ్చిన స్పందనపై కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.
దిల్లీ: పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో దేశ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్డీయేను ఎదుర్కోవడానికి ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయెన్స్(ఐఎన్డీఐఏ- ఇండియా) పేరుతో 2024 సార్వత్రిక ఎన్నికల బరిలో దిగాలని విపక్షాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో అస్సాం ముఖ్యమంత్రి, భాజపా నేత హిమంత బిశ్వ శర్మ(Assam Chief Minister Himanta Biswa Sarma) ట్విటర్ బయో( Twitter Bio)లో చేసిన మార్పు ఆసక్తిగా మారింది.
హిమంత తన ట్విటర్ బయోలో ఉన్న ఇండియా(India) అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో భారత్(Bharat) అనే పదాన్ని ఉంచారు. అలాగే బ్రిటిష్ పాలకులు మన దేశానికి ఇండియా అని పేరు పెట్టారని, ఈ వలసవాద వారసత్వం నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి ఇప్పుడు అంతా పోరాటం చేయాలని విపక్షాల కూటమిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘మన పూర్వీకులు భారత్ కోసం పోరాడారు. ఇప్పుడు మనం కూడా భారత్ కోసం పనిచేయాలి. భారత్ కోసమే భాజపా ఉంది’ అంటూ విపక్షాల కూటమి ఇండియా(Indian National Developmental Inclusive Alliance)కు కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది.
‘‘ఇండియా’ పేరుతో అస్సాం సీఎం ఉడికిపోతున్నారు. హిమంత శర్మ కొత్త మెంటార్.. మనకు స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా అని పేర్లు పెట్టారు. ఆ మెంటార్.. అన్ని రాష్ట్రాల సీఎంలు కలిసి టీమిండియా(Team India)లా పనిచేయాలని అన్నారు. అలాగే ఇండియాకు ఓటు వేయాలని కోరారు. ఇప్పుడు 26 రాజకీయ పార్టీలు ఇండియాను ఏర్పాటు చేస్తున్నట్లు పిలుపునివ్వగానే.. వలసవాద మనస్తత్వమని ఆయన(హిమంత) అంటున్నారు. అదే విషయాన్ని ఆయన బాస్(మోదీ)కు చెప్పాలి’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలు అసంతృప్తిని మిగిల్చాయి
లోక్సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలపై అసంతృప్తిగా ఉన్నామని, వాటిపై అంతర్గతంగా సమీక్షించుకుంటామని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. -
గాడి తప్పిన రాష్ట్రానికి పూర్వవైభవం తీసుకురావాలి
‘గడిచిన ఐదేళ్లలో విశృంఖల పాలనతో అన్ని విధాలుగా నాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ మీరు (చంద్రబాబు) గాడిలో పెడతారన్న నమ్మకంతో ప్రజలు చారిత్రాత్మకమైన ఆధిక్యంతో అధికారంలోకి తీసుకొచ్చారు. -
అవినీతి పాలనను అంతమొందించారు: పురందేశ్వరి
గత ప్రభుత్వ అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. -
ప్రమాణ స్వీకార వేదికపై అమిత్ షా, తమిళిసై సీరియస్ సంభాషణ!
చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏదో అంశంపై సీరియస్గా చర్చించుకుంటున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
పట్టించుకోని నాయకులకు పదవులెందుకు?
అయ్యా సమస్య వచ్చిందని చెబితే పట్టించుకోని నాయకులకు పదవులు ఎందుకని ఎంపీ అవినాష్రెడ్డి ఎదుట కడప వైకాపా కార్పొరేటర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. -
సంక్షిప్తవార్తలు
మాచర్ల నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పాల్పడిన నేరాలకు సంబంధించిన నాలుగు కేసులలో ప్రాసిక్యూషన్ తరఫున హైకోర్టులో వాదనలు వినిపించేందుకు న్యాయవాది ఎన్.అశ్వినీకుమార్ను రాష్ట్ర ప్రభుత్వం ‘స్పెషల్ కౌన్సిల్’గా నియమించింది. -
ఏక వ్యక్తి పాలనకు ప్రజల చరమగీతం: శరద్ పవార్
ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తిని లోక్సభ ఎన్నికల్లో ప్రజలు చాటిచెప్పారని ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అన్నారు. -
అరుణాచల్ సీఎంగా మళ్లీ పెమా ఖండూ
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్ర భాజపా శాసనసభాపక్ష నేతగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
ఎటూ తేల్చుకోలేకపోతున్నా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాను గెలుపొందిన వయనాడ్ (కేరళ), రాయ్బరేలీ (యూపీ) లోక్సభ నియోజకవర్గాల్లో దేనిని వదులుకోవాలనే దానిపై అయోమయంలో ఉన్నారు. -
భాగవత్ జీ! మీ సంరక్షణలోనే లోపం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ఇప్పుడు అసంబద్ధమైనదిగా మిగిలిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. -
యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జయారెడ్డి
యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుమార్తె జయారెడ్డి నియమితులయ్యారు. -
రైతులకు భరోసా ఏదీ?
రైతుభరోసా పథకం కింద ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.7,500 ఇస్తామన్న హామీ అమలుపై కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని, డిసెంబరు 9న రైతుభరోసా అన్న ముఖ్యమంత్రి హామీలు, నీటి మీది రాతలే అని తేలిపోయిందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. -
నేడు భారాస ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం
మహబూబ్నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ భారాస ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి గురువారం ఉదయం శాసనమండలిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
తెలంగాణలో 88 అసెంబ్లీ స్థానాలు సాధిస్తాం
భవిష్యత్తులో తెలంగాణ శాసనసభకు జరిగే ఎన్నికల్లో భాజపా 88 సీట్లు సాధిస్తుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
మది నిండుగా పసుపు పండగ.. ఎల్ఈడీ స్క్రీన్స్పై వీక్షించిన ప్రజలు, తెదేపా శ్రేణులు
-
భారత క్రికెట్ చరిత్రలో.. తొలి బౌలర్గా అర్ష్దీప్ అరుదైన ఘనత
-
తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం
-
రాజధానిలో నిరంతర వెలుగులు
-
న్యూయార్క్ పిచ్పై ఆడటం తేలిక కాదు.. ఇప్పుడదే బిగ్ రిలీఫ్: రోహిత్
-
దొరికినదెంత.. దోచినదెంత?.. ఫోన్ ట్యాపింగ్ నిందితుల తీరుపై అనుమానాలు