తెరాసతో కాంగ్రెస్‌ పొత్తు ప్రచారం.. మాణికం ఠాకూర్‌ క్లారిటీ

తెరాసతో కాంగ్రెస్‌కు పొత్తు ఉంటుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాకూర్‌ స్పష్టం చేశారు.

Published : 17 Apr 2022 16:46 IST

హైదరాబాద్‌: తెరాసతో కాంగ్రెస్‌కు పొత్తు ఉంటుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాకూర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.  భాజపా, తెరాసపై పోరాటంలో కాంగ్రెస్‌ ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గదని పేర్కొన్నారు. మే 6న వరంగల్‌లో నిర్వహించే సభతో తమ బలమేంటో నిరూపిస్తామని మాణికం ఠాకూర్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని