టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న బెంగళూరు

ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో అభిమానులకు మజానిస్తున్న టీ20 లీగ్‌లో మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా బెంగళూరు, దిల్లీ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్‌‌ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో

Published : 05 Oct 2020 19:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌‌: ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లతో అభిమానులకు మజానిస్తున్న టీ20 లీగ్‌లో మరో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్‌ వేదికగా బెంగళూరు, దిల్లీ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్‌‌ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో జోరు మీదున్నాయి. అంతేగాక రెండు జట్లు సూపర్‌ ఓవర్‌ ఆడి గెలవడం విశేషం. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే లీగ్‌లో ఇప్పటివరకు దిల్లీ, బెంగళూరు 23 సార్లు తలపడగా కోహ్లీసేన 14 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.

జట్టు వివరాలు

బెంగళూరు: దేవదత్‌ పడిక్కల్‌, ఆరోన్‌ ఫించ్‌, విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), ఏబీ డివిలియర్స్‌, మొయిన్ అలీ, శివమ్‌ దూబె, మహ్మద్‌ సిరాజ్‌, ఉడాన, వాషింగ్టన్‌ సుందర్‌, నవదీప్‌ సైని, చాహల్‌

దిల్లీ: శిఖర్ ధావన్‌, పృథ్వీ షా, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌, హెట్‌మెయిర్‌, మార్కస్‌ స్టాయినిస్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్, కగిసో రబాడ, నోర్జె

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని