ధోనీ చెప్పినట్లే చేశాడు.. ఆశ్చర్యపోయా
2007 టీ20 ప్రపంచకప్ ముందు భారత జట్టును ఎంపిక చేసినప్పుడు ధోనీ చెప్పిన మాటలను అక్షరాలా నిలబెట్టుకున్నాడని మాజీ సెలెక్టర్ సంజయ్ జగ్దాలే పేర్కొన్నారు...
2007 టీ20 ప్రపంచకప్ ముందు ఏం జరిగిందంటే..
ఇంటర్నెట్డెస్క్: 2007 టీ20 ప్రపంచకప్ ముందు భారత జట్టును ఎంపిక చేసినప్పుడు ధోనీ చెప్పిన మాటలను నిలబెట్టుకున్నాడని మాజీ సెలెక్టర్ సంజయ్ జగ్దాలే పేర్కొన్నారు. తాజాగా ఆయన ఓ క్రీడాఛానల్తో మాట్లాడుతూ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తాను సెలెక్టర్గా ఉండగా, మొదటి టీ20 ప్రపంచకప్ టోర్నీకి దిగ్గజ ఆటగాళ్లైన సచిన్, గంగూలీ, ద్రవిడ్.. తమని ఎంపిక చేయొద్దని స్వయంగా చెప్పారన్నారు. దాంతో యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ఇండియాను ఎంపిక చేసి ధోనీని తొలిసారి కెప్టెన్గా చేశామని తెలిపారు.
అప్పుడు తాను ధోనీతో మాట్లాడుతూ ఇదో మంచి జట్టని పేర్కొన్నట్లు గుర్తుచేసుకున్నారు. దానికి మహీ స్పందిస్తూ.. కచ్చితంగా ప్రపంచకప్తోనే తిరిగి వస్తామని చెప్పాడని సంజయ్ వివరించారు. అతడి ఆత్మవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. ఇదిలా ఉండగా, 2007లో టీమ్ఇండియా రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలో వన్డే ప్రపంచకప్లో ఘోర పరాభవం పాలైన సంగతి తెలిసిందే. అనంతరం జరిగిన తొలి టీ20 ప్రపంచకప్లో ధోనీ సారథ్యంలో పాకిస్థాన్పై ఉత్కంఠ పోరులో ఫైనల్ మ్యాచ్ గెలిచింది. దీంతో ధోనీ చెప్పిందే చేశాడని సంజయ్ వివరించారు.
ఇక మహీ టీమ్ఇండియా కెప్టెన్గా జట్టును విజయపథంలో నడిపించాడు. వరుసగా మ్యాచ్లు గెలుస్తూ భారత్ను అగ్రస్థానంలోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ సాధించాడు. ఆపై 2014 టీ20 ప్రపంచకప్లో ఫైనల్స్కు, 2015 వన్డే ప్రపంచకప్లో సెమీస్కు, 2016 టీ20 ప్రపంచకప్లో మరోసారి సెమీస్కు తీసుకెళ్లాడు. ఇక 2019 వన్డే ప్రపంచకప్లో భారత్ సెమీఫైనల్స్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలవ్వడంతో ధోనీ అంతర్జాతీయ ఆటకు దూరమయ్యాడు. ఏడాది పాటు విశ్రాంతి తీసుకొని ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇవీ చదవండి..
దుమారం రేపిన సన్నీ!
10 జట్లతో 2022 ఐపీఎల్
విలియమ్సన్ హైదరాబాద్తోనే..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.