Kohli-Gambhir: కోపం చల్లారాలంటే కోహ్లీ-గంభీర్ ఈ యాడ్లో నటించాలి : యువరాజ్ సూచన
విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ల మధ్య వ్యవహారం సాధారణ స్థితికి రావడానికి మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) ఓ సరదా సూచన చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ (Virat Kohli), గౌతమ్ గంభీర్(Gautam Gambhir )ల మధ్య చెలరేగిన తీవ్ర వాగ్వాదంపై చర్చ ఇప్పట్లో ముగిసేట్లు లేదు. ఈ అంశంపై మాజీ ఆటగాళ్లు స్పందిస్తూనే ఉన్నారు. లఖ్నవూ(Lucknow Supergiants), బెంగళూరు(Royal Challengers Bangalore) మ్యాచ్ అనంతరం.. విరాట్, గంభీర్ కోపోద్రిక్తులై ఒకరిపై ఒకరు దూసుకెళ్లేంత పని చేశారు. వారిని ఇతర ఆటగాళ్లు విడదీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై మాజీ ఆల్రౌండర్ యువరాజ్సింగ్(Yuvraj Singh) స్పందించాడు. వారిద్దరి మధ్య కోపం తగ్గేలా ఓ సరదా సూచన చేశాడు.
వీరిద్దరి మధ్య వ్యవహారం చల్లగా ఉండాలంటే.. కోహ్లీ, గంభీర్ ఓ శీతల పానీయం యాడ్కు సంతకం చేయాలని సూచించాడు. ‘యాడ్ ప్రమోషన్ కోసం గంభీర్, కోహ్లీల నుంచి సాఫ్ట్ డ్రింక్ సంతకం తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. వారిని ఇది చల్లగా ఉంచుతుంది.. మీరేమంటారు?’ అంటూ యువీ ఫన్నీ ట్వీట్ చేశాడు. దీంతో ఇది వైరల్గా మారింది.
కోచ్లు జోక్యం చేసుకోకూడదు : వాన్
ఇక ఈ అంశంపై ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్వాన్(Michael Vaughan) స్పందిస్తూ గంభీర్ ప్రవర్తించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఇలాంటివి ఆటగాళ్ల మధ్య జరుగుతూనే ఉంటాయనీ.. అయితే కోచ్ అందులో జోక్యం చేసుకోకూడదని సూచించాడు.
‘మైదానంలో ఆటగాళ్లు చిన్న చిన్న గొడవలకు దిగడాన్ని నేను పట్టించుకోను. ఇది ఆట మాత్రమే. ఇలాంటివి రోజూ జరగవు. ఈ విషయంలో కోచ్లు జోక్యం చేసుకోవడం నాకిష్టం ఉండదు. కోచ్ గానీ, కోచింగ్ డిపార్ట్మెంట్ జోక్యం చేసుకోవడం నేను చూడలేదు. మైదానంలో ఏం జరిగిందో.. మైదానంలోనే వదిలేయండి. ఇద్దరి ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగితే.. వాళ్లే పరిష్కరించుకోవాలి. కోచ్లు డగౌట్, డ్రెస్సింగ్ రూమ్లో ఉంటూ వ్యూహాలు రచిస్తుండాలి’ అంటూ వాన్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రి పెద్దిరెడ్డి వీర విధేయులపై వేటు
-
నారు పోశావా.. నీరు పెట్టావా.. మా భూములపై నీ పెత్తనం ఏంటీ?
-
ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు
-
దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధనౌకలు
-
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
-
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్