Team India: టోర్నీల్లో ఒక్కరే జట్టును గెలిపించలేరు: ప్రవీణ్ కుమార్
భారత జట్టు సాధించిన విజయాలను ఒక్కరి గెలుపుగా అభివర్ణించడం సరైంది కాదని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్లో వ్యక్తిపూజ ఎక్కువైందని ఇటీవల గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ స్పందించాడు. 2011 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమ్ఇండియా కోసం ప్రతిఒక్కరూ కష్టపడ్డారని ఓ ఇంటర్య్వూలో గంభీర్ వ్యాఖ్యానించాడు. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జట్టుగా సాధించిన విజయాన్ని కొందరికే ఆపాదించడం భారత క్రికెట్కు మంచిది కాదని ప్రవీణ్కుమార్ వ్యాఖ్యానించాడు.
‘‘ భారత్లో వ్యక్తిగతంగా ఆరాధించడం నుంచి బయటకు రావాలి. అప్పుడే క్రికెట్కు ఇంకాస్త మంచి జరుగుతుంది. రాజకీయాలు, దిల్లీ క్రికెట్.. ఇలా ఏదైనా సరే ఆ ఒరవడిని ముగించాలి. కేవలం భారత జట్టును మాత్రమే ప్రేమించాలి. అసలు ఇదంతా ఎవరు సృష్టిస్తున్నారు? కేవలం రెండింటి వల్లే ఇదంతా జరుగుతోంది. సోషల్ మీడియా ఫాలోవర్ల వల్ల ఫేక్ కూడా విస్త్రతంగా ప్రచారమవుతుంది. ఇక రెండోది.. మీడియా, బ్రాడ్కాస్టర్లు మరింత కీలక పాత్ర పోషించాయి.
వన్డే ప్రపంచ కప్ 2011ను భారత్ గెలవడంలో ప్రతిఒక్కరూ కీలక పాత్ర పోషించారు. యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్, ధోనీ.. ఇలా అందరూ బాగా ఆడారు. కానీ, ఒకరికే క్రెడిట్ ఇవ్వడం సరైంది కాదు. అందుకే, గౌతమ్ గంభీర్ చేసిన వ్యాఖ్యలు కరెక్ట్. ఎందుకంటే ఇదేమీ రెజ్లింగ్ లేదా ఇతర వ్యక్తిగత స్పోర్ట్స్ కాదు. ఒకరే మ్యాచ్ను గెలిపించలేరు. అలాగే టోర్నీల్లో జట్టును విజేతగా నిలపలేరు. యువరాజ్ సింగ్ 15 వికెట్లు + కీలక పరుగులు చేశాడు. జహీర్ ఖాన్ 21 వికెట్లు పడగొట్టాడు. గంభీర్ 2007, 2011 ఫైనల్స్లో భారీగా పరుగులు చేశాడు. ధోనీ 2011 ఫైనల్ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఏ జట్టైనా సరే కనీసం ముగ్గురు బ్యాటర్లు పరుగులు చేయాలి. ఇద్దరు బౌలర్లు వికెట్లు తీయాలి. అంతేకానీ, ఒక్కరే గెలిపించడం అసాధ్యం. అందుకే, ఈ హీరో కల్చర్ భారత క్రికెట్లో ఆగిపోవాలి. 1980ల్లోనే ఇది మొదలైంది. దీంతో క్రికెటర్లు క్రికెట్ కంటే తామే పెద్దగా భావిస్తున్నారు’’ అని ప్రవీణ్ కుమార్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.