Asian Games 2023 : అట్టహాసంగా ఆసియా క్రీడలు ప్రారంభం.. ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్!
ఆసియా క్రీడలు (Asian Games) అధికారికంగా ప్రారంభమయ్యాయి. చైనాలోని హాంగ్జౌ వేదికగా అట్టహాసంగా ప్రారంభ వేడుకలు జరిగాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడా సంబరం (Asian Games 2023) ప్రారంభమైంది. చైనాలోని హాంగ్జౌ వేదికగా అట్టహాసంగా ప్రారంభోత్సవ వేడుకలు జరిగాయి. ఇప్పటికే కొన్ని గేమ్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు అధికారికంగా క్రీడా సందడి మొదలైంది. చైనా ప్రధాని జింగ్పింగ్తోపాటు పలు దేశాల అధినేతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారత బాక్సర్ లవ్లీనా, హర్మన్ప్రీత్ సింగ్ (హాకీ కెప్టెన్) జాతీయ పతాకధారులుగా వ్యవహరించారు. నిఫ్ట్ (జాతీయ ఫ్యాషన్ టెక్నాలజీ) రూపొందించిన వస్త్రాలను అథ్లెట్లు ధరించారు.
భారత ప్రధాని ట్వీట్
ఆసియా క్రీడల ప్రారంభం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్ వేదికగా (ప్రస్తుతం ఎక్స్) అథ్లెట్లకు శుభాకాంక్షలు చెప్పారు. పతకాలను గెలుచుకుని రావాలని ఆకాంక్షించారు. ‘‘ఆసియా క్రీడా సంబరం ప్రారంభమైంది. భారత క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్. భారీ అథ్లెట్ల బృందం క్రీడల పట్ల అభిరుచి, సంకల్ప బలంతో మరిన్ని పతకాలను సాధించాలి. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి నిజమైన క్రీడాస్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పాలి’’ అని మోదీ ట్వీట్ చేశారు.
2022లో ఈ ఆసియా క్రీడలు జరగాల్సింది. చైనాలో కరోనా కేసులు కారణంగా ఓ ఏడాది వాయిదా వేశారు. అయినా వీటిని 2022 ఆసియా క్రీడలుగానే వ్యవహరిస్తున్నారు. ఈసారి ఆసియా క్రీడల్లో భారత్ నుంచి 39 విభాగాల్లో దాదాపు 655 మంది అథ్లెట్లు పతకాల కోసం బరిలోకి దిగారు. మహిళల క్రికెట్లో ఆదివారం బంగ్లాదేశ్తో భారత్ సెమీస్లో తలపడనుంది. ఇక్కడ గెలిస్తే పతకం ఖాయమవుతుంది. అక్టోబర్ 3న భారత పురుషుల క్రికెట్ జట్లు తలపడనుంది. 2018లో 70 (16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్యాలు) పతకాలు గెలిచిన భారత్.. ఈ సారి వంద పతకాలు సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇన్నింగ్స్ ఇంకా ఉంది
సందిగ్ధత తొలగింది. ఊహాగానాలకు తెరపడింది. టీమ్ఇండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నాడు. అతడి కాంట్రాక్ట్ను పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. వీవీఎస్ లక్ష్మణ్ ఎన్సీఏలోనే ఉంటాడు. -
మెప్పించాడు ఇలా...
జూనియర్ కోచ్గా, ఎన్సీఏ అధిపతిగా తనదైన ముద్ర వేసినా, మంచి పేరు తెచ్చుకున్నా ద్రవిడ్ ఏనాడు టీమ్ఇండియా కోచ్ పదవిపై ఆసక్తిని ప్రదర్శించలేదు. బీసీసీఐ పెద్దలు ప్రయత్నించినా ఎందుకో అతడు విముఖత వ్యక్తం చేశాడు. కానీ ద్రవిడ్ ఒకప్పటి సహచరుడైన గంగూలీ (అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు).. రవిశాస్త్రి అనంతరం కోచ్గా ఉండేలా ద్రవిడ్ను ఒప్పించగలిగాడు. -
మరి రోహిత్?
దక్షిణాఫ్రికా పర్యటన కోసం సెలక్షన్ కమిటీ గురువారం భారత జట్లను ప్రకటించనుంది. టీ20ల్లో తిరిగి భారత్కు నాయకత్వం వహించాలని రోహిత్ శర్మను బీసీసీఐ పెద్దలు ఒప్పించడానికి ప్రయత్నించే అవకాశముంది. 2022 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఓడినప్పటి నుంచి రోహిత్ పొట్టి క్రికెట్కు దూరంగా ఉన్నాడు. -
ఇలాంటి పరిస్థితుల్లో ఎంతైనా ఛేదించొచ్చు
ఆస్ట్రేలియాతో మూడో టీ20లో భారత పేసర్ల వైఫల్యానికి విపరీతమైన మంచు కారణమని ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఓవర్కు 14 పరుగుల లక్ష్య ఛేదన కూడా సాధ్యమేనని తెలిపాడు. 222 స్కోరును కాపాడుకోలేకపోయిన భారత్.. చివరి 5 ఓవర్లలో 80 పరుగులు సమర్పించుకుంది. -
ఆ అనుభవం ఉపయోగపడుతుంది
గొప్ప సారథుల ఆధ్వర్యంలో ఆడిన అనుభవం తనకెంతో ఉపయోగపడుతుందని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్ అన్నాడు. విరాట్ కోహ్లి, రోహిత్శర్మ సారథ్యంలో ఆడిన గిల్.. ఐపీఎల్లో తొలిసారిగా నాయకత్వం వహించనున్నాడు. -
వచ్చే ఏడాది శ్రీలంకకు టీమ్ఇండియా
సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక క్రికెట్ (ఎస్ఎల్సీ)కు శుభవార్త. వచ్చే ఏడాది జులై- ఆగస్టులో శ్రీలంకలో భారత జట్టు పర్యటించనుంది. ఈ పర్యటనలో మూడేసి వన్డేలు.. టీ20ల్లో భారత్, శ్రీలంక తలపడతాయని 2024 వార్షిక క్యాలెండర్లో ఎస్ఎల్సీ పేర్కొంది. వచ్చే ఏడాది శ్రీలంక 52 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది. -
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
ముంబయి ఇండియన్స్ (MI) జట్టులో ఏం జరుగుతుందనేది అభిమానుల్లో ఉత్కంఠగా మారింది. బుమ్రా పెట్టిన పోస్టుపై జట్టునే ఒక కుటుంబంగా భావించే మేనేజ్మెంట్ ఎలా స్పందిస్తుందో అందరిలోనూ మెదిలే ప్రశ్న. -
విలియమ్సన్ సెంచరీ
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు నువ్వానేనా అన్నట్టుగా సాగుతోంది. ఆతిథ్య బంగ్లాదేశ్ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన కివీస్కు.. బ్యాటుతో ఇబ్బందులు తప్పలేదు. ఎడమచేతి వాటం స్పిన్నర్ తైజుల్ ఇస్లాం (4/89) సత్తా చాటడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 8 వికెట్లకు 266 పరుగులు సాధించింది.