భారత్×ఆసీస్: అక్రమ్ ఫేవరెట్ ఎవరంటే?
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియానే ఫేవరెట్ అని పాకిస్థాన్ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్ అన్నాడు. సిరీస్ మొత్తం హోరాహోరీగా సాగుతుందని అంచనా వేశాడు. టీమ్ఇండియా పేసర్లు అద్భుతంగా రాణిస్తుండటమే ఇందుకు కారణమన్నాడు....
కరాచీ: బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియానే ఫేవరెట్ అని పాకిస్థాన్ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్ అన్నాడు. సిరీస్ మొత్తం హోరాహోరీగా సాగుతుందని అంచనా వేశాడు. టీమ్ఇండియా పేసర్లు అద్భుతంగా రాణిస్తుండటమే ఇందుకు కారణమన్నాడు. ఐపీఎల్ ముగియగానే కోహ్లీసేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఆతిథ్య జట్టుతో 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టుల్లో తలపడనుంది.
‘ఆస్ట్రేలియా బౌలింగ్ ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంది. వారికి ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్వుడ్ సహా టాప్క్లాస్ బౌలర్లు ఉన్నారు. ఏదేమైనప్పటికీ భారత్-ఆసీస్ పోరు హోరాహోరీగా సాగుతుంది. అయితే ఫేవరెట్ మాత్రం ఆస్ట్రేలియానే’ అని అక్రమ్ అన్నాడు. టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ల వల్ల సిరీస్ పోటాపోటీగా మారుతుందని ఆయన అంచనా వేశాడు.
‘జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, నవదీప్ సైని, ఇతర బౌలర్లు బాగున్నారు. భారత జట్టులో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. వారి దేహభాష సైతం మారింది. 1990ల్లో మేం మైదానంలోకి అడుగుపెడుతున్నప్పుడు ఉండే ఆత్మవిశ్వాసం వారిలో కనిపిస్తోంది. వాళ్ల శారీరక భాష వారెంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారో చూపిస్తోంది. భారత ఆటగాళ్లు ఏమైనా చేయగలరు’ అని ఆయన అన్నాడు.
డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ రాకతో ఆసీస్ బలం పెరుగుతుందని అక్రమ్ అన్నారు. ఆసీస్ వికెట్లు కఠినంగా ఉంటాయి కాబట్టి కూకాబుర్ర బంతి పాతబడ్డాక పరుగులను నియంత్రించడం కష్టమని పేర్కొన్నాడు. పాక్లో ఎందుకు అత్యుత్తమ పేసర్లు రావడం లేదో ఆయన వివరించాడు. టీ20లపై ఎక్కువగా దృష్టిపెట్టడం, షార్ట్కట్ల కోసం ప్రయత్నించడంతో టాప్క్లాస్ బౌలర్లు రావడం లేదన్నాడు. ఎక్కువ ఓవర్లు వేస్తేనే కండరాలు దృఢంగా మారి వేగం పెరుగుతుందన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఠాణె న్యాయవాదికి దొరికిన వందేళ్లనాటి తీర్పు కాపీ
-
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం.. వారాంతపు రోజుల్లో అవకాశం
-
రూ.5 వేలకు ఓటు అమ్ముకొని సస్పెండైన మంగళగిరి ఎస్సై
-
గెలిస్తే బాలీవుడ్కు వీడ్కోలు!.. మండీ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్
-
అమ్మానాన్నలే హంతకులయ్యారు
-
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే