IND vs BAN: కోహ్లీ సెంచరీ.. ఆ వైడ్ బాల్పై స్పందించిన బంగ్లాదేశ్ కెప్టెన్
ప్రపంచ కప్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ బాదాడు. 42 ఓవర్లో మూడో బంతికి సిక్స్ బాది జట్టును విజయ తీరాలకు చేర్చడంతోపాటు శతకం పూర్తి చేసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ కప్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) సెంచరీ బాదాడు. 42 ఓవర్లో మూడో బంతికి సిక్సర్ బాది జట్టును విజయ తీరాలకు చేర్చడంతోపాటు శతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, నసూమ్ అహ్మద్ 42 ఓవర్ ప్రారంభించడానికి ముందు కోహ్లీ 97 పరుగులతో ఉండగా.. మరో రెండు పరుగులు చేస్తే భారత్ విజయం సాధిస్తుంది. ఈ క్రమంలో కోహ్లీ సెంచరీ చేస్తాడా? లేదా? అని అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. ఈ ఓవర్లో తొలి బంతి వైడ్లా అనిపించింది. బంతి లెగ్సైడ్ వెళ్లడంతో అంపైర్ వైడ్ ఇస్తాడా? అన్నట్లు కోహ్లి చూశాడు. కానీ కోహ్లి కాస్త లోపలికి జరిగాడని భావించి అంపైర్ వైడ్ ఇవ్వకపోవడంతో కోహ్లితో పాటు అభిమానులూ ఊరట చెందారు. మూడో బంతికి సిక్సర్తో కోహ్లి శతకం అందుకున్నాడు.
అయితే, బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ సూచన మేరకే బౌలర్ నసూమ్ అహ్మద్ ఉద్దేశపూర్వకంగా వైడ్ బాల్ వేసి కోహ్లీ సెంచరీని అడ్డుకునేందుకు ప్రయత్నించాడన్న విమర్శలు ఎదురయ్యాయి. తాజాగా ఈ అంశంపై స్పందించిన నజ్ముల్ శాంటో ఆ విమర్శలను తిప్పికొట్టాడు. వైడ్ బాల్ వేయాలని ప్రత్యేక వ్యూహం ఏం లేదని, సాధారణంగా అలా జరిగిపోయిందని వివరించాడు. ‘‘అలాంటి ప్లాన్ ఏమీ లేదు. ఎప్పటిలానే ఆడాం. వైడ్ బాల్ వేయాలనే ఉద్దేశం ఏ బౌలర్కు ఉండదు. సరైన ఆట ఆడేందుకు ప్రయత్నించాం. ఇది ఉద్దేశపూర్వకంగా చేయలేదు’’ అని పేర్కొన్నాడు.
వ్యాఖ్యాత పొరపాటు.. వెంటనే స్పందించిన కోహ్లీ
బంగ్లాపై సెంచరీ చేసిన అనంతరం కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా అక్కడున్న వ్యాఖ్యాత 2011 ప్రపంచకప్లో టీమ్ఇండియా విజేతగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ ప్రపంచకప్ జట్టులో ఉండి 2023 ప్రపంచకప్ ఆడుతున్నది మీరు (కోహ్లీ) ఒక్కరే కదా అన్నారు. అయితే, అశ్విన్ కూడా ప్రస్తుతం భారత జట్టులో ఉన్న విషయాన్ని సదరు వ్యాఖ్యాత మర్చిపోయారు. దీంతో కోహ్లీ వెంటనే స్పందించాడు. ‘లేదు. 2011 ప్రపంచకప్లో నాతోపాటు అశ్విన్ కూడా ఉన్నాడు’ అని వ్యాఖ్యాతతో అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
-
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
-
కోనసీమ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
-
ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ప్రార్థించా: సినీనటి జయప్రద
-
కడప కార్పొరేటర్లపై వైకాపాకు అనుమానాలు!