Cricket: క్రికెట్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఇంతకీ ఆ నటుడు ఎవరంటే?
జింబాబ్వేలో జులై 20 నుంచి ‘జిమ్ ఆఫ్రో T10’(Zim Afro T10) అనే లీగ్ ప్రారంభంకానుంది. ఈ లీగ్లో ఒక ఫ్రాంచైజీ బాలీవుడ్ (Bollywood)కు చెందిన స్టార్ హీరో ఒకరు కొనుగోలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం ఫ్రాంచైజీ క్రికెట్ హవా కొనసాగుతోంది. తక్కువ సమయంలో కావాల్సినంత వినోదం అందుతుండటంతో అభిమానులు ఈ లీగ్లను ఆదరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో టీ20 10, టీ20 లీగ్లు పుట్టుకొస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో జింబాబ్వే కూడా ఓ టీ20 లీగ్ని నిర్వహించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. జింబాబ్వే క్రికెట్ బోర్డు ‘‘జిమ్ ఆఫ్రో T10’’ (Zim Afro T10) అనే పేరుతో ఈ లీగ్ను నిర్వహించనుంది. జులై 20న నుంచి ప్రారంభం కానున్న ఈ T10 లీగ్.. అదే నెల 29న జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది. ఈ లీగ్లో ఐదు జట్లు.. హరారే హరికేన్స్, డర్బన్ క్వాలందర్స్, కేప్టౌన్ సాంప్ ఆర్మీ, బులవాయో బ్రేవ్స్, జోబర్గ్ లయన్స్ పోటీపడనున్నాయి.
జిమ్ ఆఫ్రో T10 లీగ్తో బాలీవుడ్ (Bollwood) స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjay Dutt) కొత్త జర్నీని మొదలెట్టనున్నాడు. ఈ లీగ్లో పాల్గొననున్న హరారే హరికేన్స్ ఫ్రాంచైజీని సంజయ్ దత్ కొనుగోలు చేశాడు. ఏరీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ సోహన్ రాయ్తో కలిసి హరారే హరికేన్స్ను సొంతం చేసుకున్నాడు. “భారతదేశంలో క్రికెట్ ఒక మతం లాంటింది. క్రికెట్ ఆడే అతిపెద్ద దేశాలలో భారత్ ఒకటి. ఆటను ప్రపంచంలోని ప్రతి మూలకు తీసుకెళ్లడం మా కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. జింబాబ్వేకు కూడా క్రికెట్లో గొప్ప చరిత్ర ఉంది. క్రికెట్తో అనుబంధం ఏర్పరుచుకుని అభిమానులకు వినోదాన్ని అందించడంలో భాగస్వామిని అవుతున్నందుకు సంతోషంగా ఉంది. జిమ్ ఆఫ్రో T10లో హరారే హరికేన్స్ బాగా రాణిస్తుందని ఆశిస్తున్నా’’ అని సంజయ్ దత్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ నిర్ణయం నాకు ముందే చెప్పాడు: కోహ్లీ
ఫుట్బాల్ స్టార్ సునీల్ ఛెత్రి రిటైర్మెంట్పై అతడి ఆప్తమిత్రుడు విరాట్ కోహ్లీ స్పందించాడు. ఈ నిర్ణయంతో అతడికి సంతృప్తి లభించిందని అనుకొంటున్నట్లు వెల్లడించాడు. -
ధోనీ నుంచి అసలైన షో చూడబోతున్నాం: భారత మాజీ క్రికెటర్
మే 18న బెంగళూరు - చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇదే ఇరు జట్లకూ లీగ్ స్టేజ్లో చివరిది కావడం గమనార్హం. మరోవైపు ప్లేఆఫ్స్కు కీలకంగా మారిన మ్యాచ్ కావడంతో ఆసక్తి నెలకొంది. -
బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?
ఐపీఎల్ 17వ సీజన్లో క్రికెట్ అభిమానులు శనివారం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాకౌట్ దశకు వెళ్లే నాలుగో జట్టు ఏంటా? అనేది తేలేదప్పుడే. -
స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమా హిట్టవుతుందని చెప్పలేం: సెహ్వాగ్
ముంబయి జట్టు ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవాలని సెహ్వాగ్ సూచించాడు. రోహిత్, ఇషాన్, హార్దిక్ వంటి వారిని వదిలేయాలన్నాడు. స్టార్లతో నిండిపోయినంత మాత్రాన జట్టు విజయం సాధించదని అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే
పొట్టి ఫార్మాట్ వచ్చాక బౌలర్లపై బ్యాటర్లదే ఆధిపత్యం. మరీ ముఖ్యంగా ఐపీఎల్ వంటి లీగుల్లో ఇది ఎక్కువైంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. -
అందరి కళ్లూ అటువైపే.. నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు వారిదేనంటున్న లారా
నాలుగు మ్యాచ్లు ఉన్నా సరే.. ఒకే ఒక్క పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే చివరి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసే అవకాశం ఉంది. -
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
ఐపీఎల్లో సత్తా చాటుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి.. ఏపీఎల్లోనూ భారీ ధరను దక్కించుకోవడం విశేషం. -
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
ఆదివారం రాజస్థాన్తో కోల్కతా తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే ఇరు జట్లూ ప్లేఆఫ్స్నకు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సంజూ ఆటతీరుపై గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
వరల్డ్ కప్ జట్టులో కొందరు యువ క్రికెటర్లకు అవకాశం రాలేదు. అనుకోకుండా సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ జట్టులోకి వచ్చాడు. అతడి ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. -
ఛెత్రి ఇక చాలని..
ఈ తరానికి భారత ఫుట్బాల్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. ఎన్నో చిరస్మరణీయ ప్రదర్శనలతో దేశంలో ఆటకు దాదాపు పర్యాయపదంగా మారిన సూపర్స్టార్ అతడు. కానీ మైదానంలో అతడి పరుగు ఆగనుంది. -
రిటైరైతే కనపడను..
క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్ల్లో 661 పరుగులు చేశాడు. -
వరుణుడు ఆడుకున్నాడు
ఐపీఎల్-17వ సీజన్లో రసవత్తరంగా మారిన ప్లేఆఫ్స్ రేసును వరుణుడు చప్పగా మార్చేశాడు. పరుగుల పోటీ లేకుండానే సన్రైజర్స్ హైదరాబాద్ను తర్వాతి దశకు చేర్చేశాడు. -
శ్రీజ.. సింగిల్స్లోనూ
తెలుగుతేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్లోనూ పారిస్ ఒలింపిక్స్ బరిలో నిలవనుంది. -
క్వార్టర్ఫైనల్లో మీరాబా
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత యువ షట్లర్ మీరాబా లువాంగ్ మైసనాం జోరు కొనసాగుతోంది. -
ఫైనల్లో నిఖత్
ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఎల్డోర్ కప్ ఫైనల్కు దూసుకెళ్లింది. గురువారం మహిళల 52 కిలోల సెమీఫైనల్లో ఆమె 5-0తో కజకిస్థాన్ అమ్మాయి తొమిరిస్ మిర్జాకుల్ను చిత్తు చేసింది. -
భారత ఫుట్బాల్ గుండెచప్పుడు
సునీల్ ఛెత్రి.. భారత ఫుట్బాల్ గుండె చప్పుడు! దాదాపు రెండు దశబ్దాల పాటు అత్యుత్తమ ఆటతో జట్టు భారాన్ని మోసిన వీరుడు. మెరుపు విన్యాసాలతో అభిమానులను మైదానాలకు ఆకర్షించిన సమ్మోహన శక్తి. -
అంజుమ్, స్వప్నిల్ విజయం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో అంజుమ్ మౌద్గిల్, స్వప్నిల్ కుశాలె తమ తొలి విజయాలు సాధించారు. మహిళలు, పురుషుల 50మీ 3 పొజిషన్స్లో వాళ్లు విజేతగా నిలిచారు. -
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
ఐపీఎల్ 17 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) ఇంకా ప్లేఆఫ్స్కు చేరలేదు. ఆ జట్టు మరో విజయం సాధించి ఇతర జట్ల ఫలితాల అనుకూలిస్తే రెండో స్థానానికి చేరడానికి ఛాన్స్ ఉంది.
తాజా వార్తలు (Latest News)
-
తరగతి గది ఆవరణలో చిన్నారి మృతదేహం.. స్కూల్కు నిప్పంటించిన కుటుంబసభ్యులు
-
ఆ నిర్ణయం నాకు ముందే చెప్పాడు: కోహ్లీ
-
హింసపై ఈసీకి సీఈవో నివేదిక.. కీలక నేతల అరెస్టులకు అవకాశం?
-
రివ్యూ: విద్య వాసుల అహం.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే?
-
పాక్ వద్ద అణ్వస్త్రాలున్నా.. నిర్వహణకు డబ్బుల్లేవు కదా! - మోదీ
-
ధోనీ నుంచి అసలైన షో చూడబోతున్నాం: భారత మాజీ క్రికెటర్