WI vs IND: విండీస్తో రెండో టెస్టు.. వారిద్దరు చెలరేగితే విజయం భారత్దే!
రెండో టెస్టులో విండీస్ (WI vs IND) పోరాటం కొనసాగుతోంది. భారత్కు తేలిగ్గా విజయం దక్కేలా లేదు. ఇంకా రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఫలితంపై ఆసక్తి నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్ - భారత్ (WI vs IND) జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా మారుతోంది. అడపాదడపా వర్షం అంతరాయం కలిగించడంతో మూడో రోజు 67 ఓవర్లు మాత్రమే వేయాల్సి వచ్చింది. తొలి టెస్టులో చేతులెత్తేసిన విండీస్ బ్యాటర్లు ఈసారి మాత్రం పోరాడారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 229/5 స్కోరుతో కొనసాగుతోంది. కేవలం రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. తొలి ఇన్నింగ్స్లో విండీస్ ఇంకా 209 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజ్లో అథనేజ్ (37*), జాసన్ హోల్డర్ (11*) ఉన్నారు. నాలుగో రోజు వెస్టిండీస్ను త్వరగా ఆలౌట్ చేయడంతోపాటు భారత బ్యాటింగ్ దూకుడుగా ఉండాలి. లేకపోతే మ్యాచ్ డ్రాగా ముగిసినా ఆశ్చర్య పడక్కర్లేదు.
అశ్విన్ ‘మ్యాజిక్ డెలివరీ’.. బ్రాత్వైట్ క్లీన్బౌల్డ్..
స్పిన్ ద్వయంపైనే..
రెండో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్ను క్లీన్స్వీప్ చేయాలంటే భారత బౌలర్లు మరింత మెరుగ్గా రాణించాలి. మరీ ముఖ్యంగా భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మరోసారి చెలరేగితే విండీస్కు కష్టాలు తప్పవు. తొలి ఇన్నింగ్స్లో ఇప్పటి వరకు విండీస్ కోల్పోయిన ఐదు వికెట్లలో మూడింటిని వీరిద్దరే తీశారు. నాలుగు, ఐదు రోజుల్లో పిచ్ స్పిన్కు అనుకూలంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వర్షం లేకుండా ఉంటే అశ్విన్, జడ్డూ తమ మాయతో విండీస్ను కట్టిపడేయాలి. అరంగేట్ర బౌలర్ ముకేశ్ కుమార్ కూడా తొలి వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. సిరాజ్ కట్టుదిట్టంగా బంతులు వేసినా ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. ఇక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయ్దేవ్ ఉనద్కత్ (0/44) ప్రభావం చూపించలేదు.
నేడు అరగంట ముందుగానే..
మూడో రోజు వర్షం కారణంగా దాదాపు గంటన్నర ఆట వృథా అయింది. దీంతో నాలుగో రోజు వాతావరణం అనుకూలిస్తే అరగంట ముందే ఆటను ప్రారంభించే అవకాశం ఉంది. వర్షం కారణంగా మూడో రోజు ఆటలో 23 ఓవర్ల ఆట వృథాగా మారింది. మొత్తం 67 ఓవర్ల ఆటలో భారత్కు నాలుగు వికెట్లు దక్కగా... విండీస్ బ్యాటర్లు 143 పరుగులు సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!