CSK vs PBKS: చెపాక్లో ‘కింగ్స్’ పోరాటం.. గెలిస్తే అగ్రస్థానంలోకి ధోనీ సేన!
సండే డబుల్ బొనాంజాలో భాగంగా తొలుత పంజాబ్ కింగ్స్తో చెన్నై సూపర్ కింగ్స్ (CSK vs PBKS) తలపడనుంది. చెపాక్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో సీఎస్కే గెలిస్తే పాయింట్ల పట్టికలో తొలి స్థానంలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం 10 పాయింట్లతో సీఎస్కే నాలుగో స్థానంలో ఉండగా.. పంజాబ్ 8 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) సీజన్లో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ X పంజాబ్ కింగ్స్ జట్ల (CSK vs PBKS) మధ్య చెపాక్ వేదికగా కీలక పోరాటం జరగనుంది. ఈ మ్యాచ్లో సీఎస్కే గెలిస్తే పాయింట్ల పట్టికలో టాప్ స్థానానికి దూసుకెళ్లే అవకాశం ఉంది. అలాగే పంజాబ్ విజయం సాధిస్తే ఆ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగవుతాయి. చెపాక్లో ‘కింగ్స్’ ఎవరనేది తెలియాలంటే వేచి చూడాలి.
సీఎస్కే పరిస్థితి ఇలా..
ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని (MS Dhoni) చెన్నై ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడింది. ఇందులో ఐదు మ్యాచుల్లో గెలిచింది. గతేడాది ఫైనలిస్టులు గుజరాత్, రాజస్థాన్ చేతిలోనే ఓటమిపాలు కావడం గమనార్హం. మరీ ముఖ్యంగా రాజస్థాన్తో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడింది. ఈ క్రమంలో ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగువ్వాలంటే మిగిలిన ఆరు మ్యాచుల్లో కనీసం ఐదు విజయాలను నమోదు చేయాలి. బౌలింగ్లో అనుభవలేమి వల్ల కీలక మ్యాచుల్లో వెనుకబడాల్సిన పరిస్థితి. పతిరాణ, తీక్షణ, దేశ్ పాండే, ఆకాశ్ సింగ్ అప్పుడప్పుడూ గాడి తప్పడం సీఎస్కేకు కష్టంగా మారింది. బ్యాటింగ్లోనూ అంబటి రాయుడు వరుసగా విఫలమవుతూ నిరాశపరుస్తున్నాడు. పంజాబ్ బౌలర్లు అర్ష్దీప్, రబాడ, రాహుల్ చాహర్, సామ్ కరన్ను అడ్డుకోవడంపై చెన్నై బ్యాటర్లు దృష్టిపెట్టాలి.
ఆ షాక్ నుంచి త్వరగా కోలుకోవాలి..
భారీ హిట్టర్లు ఉన్న ముంబయి ఇండియన్స్ను అడ్డుకున్న పంజాబ్ కింగ్స్ బౌలర్లు లఖ్నవూ చేతిలో మాత్రం చావుదెబ్బ తిన్నారు. మూడు మ్యాచుల తర్వాత వచ్చిన కెప్టెన్ ధావన్కు షాక్కొట్టిన ఫలితం అది. ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యధిక స్కోరు 257/5 ఇచ్చిన జట్టుగా పంజాబ్ చెత్త రికార్డును ఖాతాలో వేసుకుంది. అయితే, కెప్టెన్ శిఖర్ ధావన్ విఫలమైనప్పటికీ పంజాబ్ బ్యాటర్లు పోరాడి 200కుపైగా పరుగులు సాధించారు. ఇప్పుడు చెపాక్ వేదికగా చెన్నైను ఓడించాలంటే మళ్లీ పంజాబ్ బౌలర్లు పుంజుకోవాల్సిందే. భారీగా హిట్టింగ్ చేయగల సమర్థులు సీఎస్కే సొంతం.
పిచ్ రిపోర్ట్
వాతావరణం చల్లగా ఉండటంతో కాస్త బౌలింగ్కు అనుకూలంగా ఉండొచ్చు. అయితే, వర్షం అడ్డంకిగా మారనుందని తెలుస్తోంది. దీంతో టాస్ నెగ్గే జట్టు బౌలింగ్కే మొగ్గు చూపి పిచ్ నుంచి వచ్చే అడ్వాంటేజ్ను పొందేందుకు ఆస్కారముంది.
జట్లు (అంచనా)
చెన్నై: డేవన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానె, మొయిన్ అలీ, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్ / వికెట్ కీపర్), తుషార్ దేశ్పాండే, మహీశా పతిరాణ, మహీశ్ తీక్షణ, ఆకాశ్ సింగ్
ఇంపాక్ట్ ప్లేయర్: అంబటి రాయుడు
పంజాబ్: శిఖర్ ధావన్ (కెప్టెన్), అథర్వ తైడే, లియామ్ లివింగ్స్టోన్, సికిందర్ రజా, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), షారుఖ్ ఖాన్, హర్ప్రీత్ బ్రార్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్
ఇంపాక్ట్ ప్లేయర్: ప్రభ్సిమ్రన్ సింగ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Gujarat vs Bengaluru: గుజరాత్పై బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీ విన్నింగ్ సెలబ్రేషన్స్
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. 201 పరుగుల లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత బెంగళూరు జట్టు విన్నింగ్ సెలబ్రేషన్స్ మీరూ చూడండి.
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో నెగ్గి సంచలనం సృష్టించిన తెలుగు కుర్రాడు గుకేశ్ను తమిళనాడు సీఎం స్టాలిన్ భారీ నగదు ప్రోత్సాహకంతో సన్మానించారు. -
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
బంగ్లాతో తొలి టీ20లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. -
Gujarat Vs Bengaluru: విల్ జాక్స్ సూపర్ సిక్స్.. ఆశ్చర్యంలో విరాట్ కోహ్లీ..!
గుజరాత్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు బ్యాటర్ విల్ జాక్స్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. జాక్స్ కొట్టిన సిక్స్లను చూస్తూ విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు. ఆయన ఎక్స్ప్రెషన్స్ మీరూ చూడండి.
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
బెంగళూరు మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.